11-06-2025 10:55:41 PM
చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) చేగుంట మండల కేంద్రంలో గల వివిధ ప్రభుత్వ పాఠశాల లో పని చేసుతున్న వంట కార్మికులు నేడు మండల విద్యా వనరుల కేంద్రం వద్ద సిఐటియు, బాలమణి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటుయు, బాలమణి మాట్లాడుతూ... మెదక్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కింద వివిధ స్కూళ్లలో, వంట కార్మికులకు, ఇప్పటివరకు బిల్లులు, చెల్లించడం లేదు, మరి రేపటి నుండి స్కూలు ప్రారంభం అవుతున్నాయి.
వీరి దగ్గర డబ్బులు లేవు, వీరికి గత సంవత్సరం బిల్లులు రాక, ఇప్పుడు మళ్లీ ఎలా తెచ్చి వండుతారని ఆమె అన్నారు. ప్రభుత్వ అధికారులు, నాయకులు అప్పుడప్పుడు, పాఠశాలలకు వచ్చి, పిల్లలకు మంచి భోజనం, రుచికరమైన భోజనము పెట్టాలని చెబుతారు, కానీ వీరికి బిల్లు రావడం లేదు అని అంటే ఎవరు పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు, బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వము విఫలం అయిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే వీరికి బకాయిలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ స్కూల్లో, పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు.