11-06-2025 10:52:52 PM
ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు భూక్య రాజు నాయక్..
పెన్ పహాడ్: గిరిజనుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్(MLA Dr. Jatoth Ram Chander Naik) గతంలో ప్రభుత్వ విప్పుగా.. నేడు శాసన డిప్యూటీ స్పీకర్ గా రేవంత్ ప్రభుత్వం పదవులు ఇచ్చి గిరిజనులకు పెద్దపీట వేసిందని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు భూక్య రాజు నాయక్ అన్నారు. బుధవారం పెన్ పహాడ్ మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గిరిజనులకు ఉన్నత పదవులు అందించడం.. రాష్ట్రంలో నిష్పక్ష పాలన అందించడంలో రేవంత్ ప్రభుత్వానికే సాధ్యమైందని అన్నారు.
ఉన్నత కులాలే కాదు బడుగు బలహీన వర్గాల కు పదవులు అందించి ప్రజా పాలనలో సమాన హక్కులు కల్పించడంలో రేవంత్ రెడ్డి కృషి అభినందనీయమన్నారు. డాక్టర్ రామచంద్రనాయక్ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నిక కావడం పట్ల లంబాడి హక్కుల పోరాట సమితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఏఐసీసీ, పీసీసీ కమిటీకి ఎల్ హెచ్ పి ఎస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.