బాధిత కుటుంబానికి పరామర్శ
02-06-2026 02:01 AM
గట్టు, జూన్ 1: గట్టు మండల కేంద్రానికి చెందిన తెలుగు రంగస్వామి చేపల వేటకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ పార్టీ బాధ్యులు బాసు హనుమంత నాయుడు సోమవారం గద్వాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరి వెంట బీచుపల్లి, రామ్ నాయుడు ,వెంకటేష్, శ్రీరాములు నర్సింలు తదితరులు ఉన్నారు






