3 April, 2026 | 1:47 PM

Breaking News

రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి   •   కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •   దక్షిణాసియా వస్త్ర రాజధానిగా తెలంగాణ — సీఎం రేవంత్ రెడ్డి   •   కలెక్టర్ ఆదేశాలు బే ఖాతర్   •   Warangal Sub-Registrar Officeలో సోదాలు.. అక్రమాల గుట్టు విప్పిన ఏసీబీ   •   సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం... గ్రూప్-1 ఆశావహులకు ఇది పెద్ద ఊరట   •  

రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీ

06-05-2024 02:06 AM

పథకాలే బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయి

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

కామారెడ్డి, మే 5 (విజయక్రాంతి): జహీరాబాద్ పార్లమెంట్‌లో రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీ పడుతున్నాయని జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ ఇన్‌చార్జ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలోని పల్వంచ మండల కేంద్రంతో పాటు కామారెడ్డిలో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జహీరాబాద్‌లో బీబీ పాటిల్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు అందరూ మద్దతు తెలుపుతున్నారని అన్నారు. పథకాలే బీజేపీని మరోసారి కేంద్రంలో అధికారంలోకి తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజంపేటకు చెందిన యువకులు, మహిళలు బీజేపీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్, నాయకులు నరేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆకుల భరత్, మోహన్ రెడ్డి, తేలు శ్రీనివాస్, అంజల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.