15-07-2025 12:24:41 AM
మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్
మహబూబాబాద్, జూలై 14 (విజయ క్రాంతి): ప్రజలకు అలవికాని విధమైన 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే భానోతు శంకర్ నాయక్ ఆరోపించారు. స్థానిక ఎన్నికలతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బీ ఆర్ ఎస్ అధికారంలోకి రావడం తధ్యమని ఆయన అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో సోమవారం ఆ పార్టీ ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే మహబూబాబాద్, కేసముద్రం అభివృద్ధి కోసం 300 కోట్ల రూపాయలను తాను మంజూరు చేయించానని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయలేదని ఎద్దేవా చేశారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి, యాకూబ్ రెడ్డి, దుర్గేష్, నజీర్ అహ్మద్, శ్రీనివాస్, రవీందర్ గౌడ్,కొమ్మన్న, వీరునాయక్, జాటోత్ హరీష్ నాయక్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.