13-02-2026 07:48:35 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో 12 వార్డులకు 11 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని ఎల్లారెడ్డి గడ్డపై స్థానిక మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసినందున నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ శ్రేణులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.జై కాంగ్రెస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్,ఉపాధ్యక్షులు లక్ష్మణ్ ఠాగూర్,ప్రధాన కార్యదర్శి దివిటీ కిష్టయ్య,వర్కింగ్ ప్రెసిడెంట్ వాసురెడ్డి,మైనార్టీ అధ్యక్షులు హిమాం,నాగిరెడ్డిపేట గ్రామ సర్పంచ్ మన్నే వెంకట్,గోపాల్పేట్ ఉప సర్పంచ్ గులాబ్ హుస్సేన్, సీనియర్ నాయకులు సుధాకర్,ఫారూఖ్, మునిగేపల్లి సంగయ్య,బండ బాబు,హనుమాన్లు, నర్సింహారెడ్డి,సురేందర్ గౌడ్, మహేష్ రెడ్డి,కిష్టయ్య,సన్నీ తదితరులు పాల్గొన్నారు.