calender_icon.png 10 June, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీలను విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

09-06-2025 12:17:52 AM

  1. కేబినెట్‌లో మైనార్టీలకు మొండిచేయి

మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం మైనార్టీ మంత్రిని నియమించాలి 

మైనార్టీ జిల్లా అధ్యక్షుడు యాకూబ్ పాషా 

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 8, (విజయక్రాంతి)తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ లో మైనారిటీలకు మంత్రి పదవి కెటాయించకుండా మొండిచేయి చూపించింద ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ. యాకూబ్ పాషా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మై నారిటీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు.

మైనారిటీ మంత్రి లేని కారణంగా గత కొన్ని నెలలు గా అనేక మైనారిటీ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీ గురుకులాలు ఇరుకైన కిరాయి భవనాల్లో, అసౌకర్యాల మధ్య నడుస్తున్నాయని, ఇప్పటివరకు మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు కానీ, మైనా రిటీ స్టడీ సర్కిల్లు లేవని అన్నారు. అలాగే వక్ఫ్ భూముల సర్వే, వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి వక్ఫ్ బోర్డు, మైనారిటీ సంక్షేమ శాఖలలో ఉద్యోగ నియామకాలు జరగలేదని, గత ప్రభుత్వం ఉర్దూ మీడియం స్కూళ్లను ఇంగ్లీష్ మీడియంగా మార్చి ఉర్దూ భాషను కనుమరుగు చేసిందని ఆయన తీవ్రంగా విమ ర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని పూర్తి గా విస్మరిస్తోందని, ఈ చిన్నచూపు తగదని హితవు పలికారు. ఓసిలు 6, ఎస్సీలు 4, బీసీలు 3, ఎస్టీల నుండి ఒకరిని మంత్రి వర్గంలోకి తీసుకున్న ముఖ్యమంత్రికి మైనార్టీల నుండి ఒక్కరూ కనిపించకపోవటం విడ్డూరంగా ఉందన్నారు.

మైనా ర్టీలను కేవలం ఓటు బాంకు కోసం మాత్రమే ఉపయోగించు కుంటున్న కాంగ్రెస్ అదిష్టానం ఆలోచనా సరళిని మార్చుకో వాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి త్వరలో జరగనున్న క్యాబినెట్ విస్తరణలో మైనారిటీలకు సముచిత స్థానం కల్పించాలని, లేని మైనార్టీల నుండి తీవ్ర వ్యతిరేఖతను ముఖ్యమంత్రి మూట కట్టుకోవటం ఖాయమన్నారు.

మైనారిటీల నుండి మంత్రి లేకపోవటంతో మైనారిటీల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి,అక్కడే అన్న చందంగా ఉన్నా యని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని విడనాడాలని యాకూబ్ పాషా ప్రభుత్వానికి సూచించారు. సమావేశంలో హుస్సేన్ ఖాన్, సలీం, గౌస్ పాల్గొన్నారు.