09-06-2025 12:19:53 AM
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 8 (విజయ క్రాంతి)దోపిడీ, అణచివేతకు గురవుతూ దుర్భరజీవితం గడుపుతున్న ఏజెన్సీ పల్లె ప్రజల జీవన ప్రమాణాల మార్పుకు నంది పలికి ఆధునికతవైపు నడిపించింది ఎర్ర జెం డానేనని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కెసాబీర్ పాషా అన్నారు.
రాష్ట్ర వ్యాపిత జరుగుతున్న మహాసభల్లో భాగం గా ఆదివారం లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని మైలారం, బంగారుచెలక, చింతకుంట, పూనుకుడుచెలక, లక్ష్మీపురం, బొజ్జలగూడెం గ్రామపంచాయతీల పరిధిలోని 31 గ్రామశాఖల సంయుక్త మహాసభ తిప్పగుట్ట గ్రా మం లో జరిగింది. మహాసభ సందర్బంగా గ్రా మంలోని వీధిలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పార్టీ జెండాను ఎగురవేసిన మహాస భను సాబీర్ పాషా ప్రా రంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అసమానతలు లేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టు ల అంతిమ లక్ష్యమని, అన్యాయం, దోపిడీ, అణచివేతలున్నంతకాలం ఎర్రజెండా ఉం టుందని స్పష్టం చేశారు. ఉమ్మడి బంగారుచెలక, మైలారం గ్రామపంచాయతీ పరిధిలో పేదల పక్షాన నిలబడి అనేక భూపోరాటాలకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహిం చి వేలాది ఎకరాలను పేదలకు పంచి బతు కు దారి చూపిందని, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు శక్తివంచ న లే కుండా కృషిచేసిందని, ఆ పోరాటాల ఫలితంగానే గ్రామీ ణ జనం కమ్యూనిస్టు పార్టీకి బలమయ్యారన్నారు.
ఇక్కడి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రశ్నించే, ఎదురించే, పోరాడే తత్వాన్ని నేర్పిందని పేర్కొన్నారు. కమ్యూనిస్టులు లేకుండా చేయాలని కుట్రలు చేసిన వారిని ఇండ్లకే పరిమితం చేసిన పోరాట పటిమా ఈ ప్రాంత గ్రామీణ ప్రజలదని అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను, కమ్యూనిస్టులను లేకుండా చేయాలని కేంద్రంలోని మోడీషా ద్వయం కలలు కంటోందని, ఎర్ర జెండాను, కమ్యూనిజాన్ని ప్రజల నుంచి దూరంచేయలేర న్నారు.
మావోయిస్టులను, కమ్యూనిస్టులను లేకుండా మోయాలనుకోవడం వారి అవివేకమని, ఆపరేషన్ కగార్ చర్యలకు స్వస్తి చెప్పి ప్రజలకు కావాల్సిందేంటో గుర్తించి వాటిని ప్రజల ధరించేందుకు కేంద్రం పూనుకోవాల ని సూచించారు. అనంతరం 31 గ్రామాల నూతన కమిటీలను పార్టీ సభ్యులు ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు.
సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాసరావు, జిల్లా సమితి స భ్యులు దీటి లక్ష్మీపతి, నాయకులు నూనావత్ గోవిందు, కంటెం సత్యనా రాయణ, దారా శ్రీనివాసరావు, జోగా రామ య్య, సపావట్ రవి, బానోత్ నెహ్రు, జర్పు ల ఉపేందర్, పరిపర్తి రాజు, జోగా రాజబా బు, కోడి లింగయ్య, జలీల్ పాషా, శర్వన్, జ నార్దన్, లాలూ, లక్ష్మీనారాయణ, వరుస రామస్వా మి, ముత్తయ్య, మోహన్, శంకర్, గోపాల్, జానయ్య, బుచ్చ య్య తదితరులు పాల్గొన్నారు.