calender_icon.png 30 May, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు నడ్డి విరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

29-05-2025 02:16:44 AM

బీఆర్‌ఎస్ రామారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం 

కామారెడ్డి, మే 28,(విజయ క్రాంతి): రైతు రాజ్యం అని చెప్పి రైతులను నడ్డి ఏడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమే అని  టిఆర్‌ఎస్ పార్టీ రామారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి అన్నారు.

వివరాల్లోకి వెళితే మండల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడగల శ్రీనివాస్ తో కలిసి మాట్లాడటం జరిగింది. రామారెడ్డి మండలంలో 17వేల ఎకరాలలో వరి సాగు చేయడం జరుగుతుంది.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రామారెడ్డి మండలానికి రెండు వందల బ్యాగులను జిగురు విత్తనాలను ఇవ్వడం జరిగింది. 200 బ్యాగులు 500 ఎకరాలకు కూడా సరిపోవడం జరగదు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 30 కిలాల బ్యాగును 840కి ఇస్తే రైతుల ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం 30 కిలోల జిలుగు బ్యాగును 2140 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే గత ప్రభుత్వాన్ని కంటే రెండు రెట్లు పెంచి రైతులు నడ్డి విరచడం జరుగుతుంది.

ఇప్పటివరకు వరి ధాన్యానికి బోనస్ కూడా చెల్లించడం జరగలేదు. మా రామారెడ్డి మండల కేంద్రంలో సుమారు బోనస్ రూపంలో రావాల్సిన డబ్బు ఒక కోటి 50 లక్షలు వరకు రైతులకు జమ చేయవలసి నా రూపాయలను ఇంతవరకు జమ చేయడం జరగలేదు. పూర్తిగా రుణమాఫీ కూడా చేయడం జరగలేదు. ఎకరానికి 15000 చెప్పి రూ.12,000 ను అది కూడా అందరి రైతులకు ఇవ్వకుండా రైతు భరోసాను కాలయాపన చేయడం జరుగుతుంది.

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు అని రాబోయే రోజులలో రైతులతో గెలిచిన మీ ప్రభుత్వానికి రైతులు గుణపాఠం తప్పక చెప్తారని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల యూత్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గంగారం,రాజు, మాజీ ఎంపీటీసీ రాజేందర్, మాజీ ఉపసర్పంచ్ పోతులూరి ప్రసాద్, మాజీ మండల ప్రధాన కార్యదర్శి మైపాల్, మాజీ టిఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు సుధాకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.