calender_icon.png 6 June, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎట్టకేలకు ‘మోడల్ హౌస్’ కు స్లాబ్!

04-06-2025 01:48:29 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిషత్(Kesamudram Mandal Parishad) ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ పైకప్పుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నేపథ్యంలో ముందుగా ప్రతి మండలంలో ఐదు లక్షల వ్యయంతో ఒక మోడల్ హౌస్ నిర్మించి, లబ్ధిదారులకు ఆ విధంగా ఇల్లు నిర్మించుకోవాలని ప్రదర్శించడానికి నిర్ణయించింది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

కొన్నిచోట్ల మాత్రమే నిర్మించగా చాలాచోట్ల వివిధ కారణాలతో జాప్యం చేస్తుండడంతో ఇటీవల విజయ క్రాంతి దినపత్రికలో ’అడుగడుగునా అడ్డంకులే' అనే శీర్షికతో అసంపూర్తిగా ఉన్న మోడల్ హౌస్ నిర్మాణాలపై ప్రత్యేక కథనం ప్రచురించడం జరిగింది. ఈ నేపథ్యంలో కేసముద్రం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో స్లాబ్ లెవెల్ పూర్తిచేసిన మోడల్ హౌస్ కు పైకప్పుకు స్లాబ్ పనులను బుధవారం చేపట్టారు. ఎంపీడీవో క్రాంతి స్లాబ్ పై కప్పు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. 15 రోజుల్లోగా మోడల్ హౌస్ నిర్మాణం పూర్తి చేసి, లబ్ధిదారులకు 5 లక్షల బడ్జెట్ లో ఇల్లు నిర్మించుకునేందుకు అనువుగా రూపొందించి చూపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ హరిప్రసాద్, హౌసింగ్ ఏఈలు లాల్ సింగ్, అభినయ్, కార్యాలయ సిబ్బంది కృష్ణ కుమార్, పవన్ పాల్గొన్నారు.