23-06-2025 01:11:55 PM
హైదరాబాద్: గాంధీభవన్ లో భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ వర్గాలు(Congress Factions) ఆరా తీశాయి. పోలీసులు ఉన్నా లారీ లోపలికి రావడంపై కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంఘ విద్రోహ శక్తులు వస్తే పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నెలకొంది. గాంధీ భవన్ వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. గొల్ల కుర్మలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని గొల్ల కుర్మల సంఘాలు గాంధీ భవన్(Gandhi Bhavan) ముందు గొర్రెలతో ఆందోళనకు దిగారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ గాంధీ భవన్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. యాదవ హక్కు పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాదవ, గొల్ల, కురుమ వర్గాల శాసనసభ్యులను వెంటనే రాష్ట్ర మంత్రివర్గంలోకి(State Cabinet) తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.