21-02-2026 01:43:44 AM
ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన మంత్రి అడ్లూరి
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డి అస్వస్థతకు గురయ్యా రు. వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు బేగం పేటలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్చించారు. విషయం తెలుసుకున్న రా ష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆస్పత్రికి వెళ్లి జీవన్రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జీవన్రెడ్డి కి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు మంత్రి సూచించారు. త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.