03-02-2026 05:28:15 PM
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్
జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రజాసేవకే తన జీవితం అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి జవహర్ నగర్ వ్యవస్థపకులు మాజీ సర్పంచ్ నర్సింగ్ రావ్ గౌడ్ అని జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ అన్నారు. మంగళవారం నర్సింగ్రావుగౌడ్ 27వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నర్సింగ్ రావ్ గౌడ్ ఎంతో కృషి చేశారని, ప్రజా సేవకే తన జీవితం అంకితం చేశాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ వేణు, నాయకులు బూడిద వెంకటేష్, రమేష్చరి, దయాకర్ చారి, నందుగౌడ్, సాయికృష్ణ, రాజుయాదవ్, శంకర్ తదితరలు పాల్గొన్నారు.