23-06-2025 12:00:00 AM
- కౌశిక్ రెడ్డి దేశం విడిచి పారిపోతుండగా పోలీసులు అరెస్టు చేశారు
- హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ఒ డితల ప్రణవ్ బాబు
హుజూరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): స్కాంలకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అని హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ఆరో పించారు.ఆదివారం హుజూరాబాద్ పట్టణంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ,కేసీఆర్, హరీష్ రావు కాలేశ్వరం స్కాంల చుట్టూ తిరుగుతున్నారు.
కేటీఆర్ కార్ రేసింగ్ స్కాంలో, కవిత లిక్కర్ స్కాంలో చిక్కుకున్నారని ఆరోపించారు.ఇవ న్నీ సరిపోక, ఇప్పుడు కౌశిక్ రెడ్డి అనే మరో మలకంపును తగిలించుకొని వత్తాసు పలుకుతున్నారన్న ప్రణవ్, కౌశిక్ రెడ్డి అరెస్టును కాంగ్రెస్ పార్టీపై మోపడం పూర్తిగా అనవస రం. ఆయన దేశం విడిచి పారిపోతుండగా, పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్టులో అరె స్టు చేశారు.
ఇది పూర్తి గా చట్ట ప్రక్రియలో భాగమే అని స్పష్టం చేశారు.ఎమ్మెల్సీగా ఉ న్న సమయంలో వ్యాపారస్థుల వద్ద డ బ్బులు డిమాండ్ చేసిన కేసులో ఆయనపై కేసులు నమోదయ్యాయని,బెదిరింపులకు గురైన వ్యాపారి భార్య ఫిర్యాదు చేశారని వివరించారు.తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్ ఎందుకు వేయాలి?అని ప్రశ్నించా రు.
ప్రజలను మోసం చేస్తూ గుండెలపల్లి ప్రజలకు నకిలీ చెక్కులు ఇచ్చారని ఆరోపించిన ఆయన,ఇప్పుడు బెయిల్ మీద బయ టకు వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు డ్రామా చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ఉద్యమ సమయంలో కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.హుజూరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని ప్రణ వ్ బాబు స్పష్టం చేశారు.
అనంతరం పట్టణంలోని దమ్మక్కపేటలో రూ.20 లక్షల నిధులతో సాగునీటి, త్రాగునీటి సరఫరా పైప్లైన్ పనులకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మోతే తిరుపతి,నాయకులు రవి, మిడిదొడ్డి శ్రీనివాస్ తోపాటుతదితరులుపాల్గొన్నారు.