12-06-2025 12:17:36 AM
సన్మాన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్
మంథని జూన్ 11(విజయ క్రాంతి) నూతన బాధ్యతలలో విజయవంతంగా ముందుకు సాగాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబుకు సన్మానంలో రామ గుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ నివాసంలో మం థని నియోజకవర్గానికి చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే నియమితులైన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తమ్ముడు దుద్దిల శ్రీను బాబు రాజ్ ఠాకూర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీను బాబు ను శాలువాతో సన్మానించి, ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.నూతన బాధ్యతలలో విజయవంతంగా ముందుకుసాగాలని ఆకాంక్షిస్తూ, తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీపీసీసీ నాయకులు, అభిమానులు,నాయకులు పాల్గొన్నారు.