22 June, 2026 | 2:37 PM

Breaking News

దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •  

కాంగ్రెస్ పైచేయి

15-12-2025 08:14 AM

హైదరాబాద్: తెలంగాణ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ(Telangana Panchayat elections) కాంగ్రెస్ మద్దతుదారులు(Congress Supporters) విజయం సాధించారు. 4,333 స్థానాల్లో సగానికి కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. రెండో విడత ఎన్నికల్లో 1,188 స్థానాల్లో బీఆర్ఎస్, 624 స్థానాల్లో ఇతరులు, 268 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. సిద్దిపేట, కుమురం భీం, జనగామ, నిర్మల్ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది.

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 85.86 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో నమోదైన 84.28 శాతం పోలింగ్ కన్నా 1.58 శాతం ఎక్కువ. యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యధికంగా 91.72 శాతం పోలింగ్ నమోదు కాగా,  నిజామాబాద్ లో అత్యల్పంగా 76.71 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశలో 4,333 సర్పంచ్, 38,350 వార్డు సభ్యులు ఎన్నికయ్యారు. రెండో దశలో 415 గ్రామ సర్పంచి, 8,307 వార్డు పదవులు ఏకగ్రీవం అయ్యాయి.