16 March, 2026 | 3:10 PM

Breaking News

యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో   •   అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •  

విద్యార్థులకు పురుగులన్నమే కాంగ్రెస్ విజయం

05-12-2024 02:25 AM

* కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్, డిసెంబర్ ౪ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ దృష్టిలో గురుకుల విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టడం కాంగ్రెస్ పార్టీకి ఏడాదిలో లభించిన విజయమని.. విద్యార్థుల చావులు వారికి ఉత్సవమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలివ్వకపో వడం కాంగ్రెస్ సర్కారు విజయమని, వారికి సంకెళ్లు వేయడం ఉత్సవమని విమర్శించారు. బుధవారం బండి సంజయ్ ఎక్స్ వేదికగా ప్రభుత్వ విజయోత్సవాలపై విమర్శలు చేశారు.

రైతులను మోసం చేయడం, వారికి ఉరితాళ్లు వేయడం, ఆడబిడ్డలను ఆగం చేయడం, వారి కన్నీళ్లు విజయోత్సవాలుగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇండ్లు ఇస్తామని మో సం చేయడం, ఉన్న ఇండ్లు కూల్చేయడం, రుణమాఫీ చేస్తామని మాట తప్పడం, అప్పులకు నోటీసులివ్వడం ఏడాదిలో పాలనలో సాధ్యమైనట్టు తెలిపారు. ఏడాది అరాచక పాలనే కాంగ్రెస్ విజయమా? ప్రజల చావు లు, గోసలే ఉత్సవమా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నవి విజయోత్సవాలు కావని... ఇవి వికృత ఉత్సవాలని ఆరోపించారు.