03-09-2024 12:00:00 AM
డా॥వి.విష్ణున్రావు వీరపనేని :
ప్రకృతిని దైవంగా భావించి పూజించే భారతీయ సంస్కృతి ని మూఢనమ్మకంగా అవహేళన చేసే రోజులు పోయాయి. ఇటీవల ఇటలీలో జరిగిన ‘రిలీజియస్ ఎన్విరాన్మెంటలిజం’పై జరిగిన ప్రపంచ సదస్సులో ప్రకృతి సంరక్షణకు సంబంధించిన సదస్సులో పాల్గొ న్న పలువురు పర్యావరణ శాస్త్రవేత్తలు భారతీయుల దూరదృష్టిని కొనియాడటం ఇందుకు తాజా ఉదాహరణ. ప్రపంచంలో ని 90 శాతం జనాభా అనుసరించే ఆయా ప్రధాన మతాలలో ప్రకృతిని రక్షించుకొనే ఉపాయాలు, ఆచారాలు ఉన్నాయి.
తరతరాలుగా ప్రకృతిని ఏ విధంగా రక్షించుకో వాలో అవి మనకు చెప్పాయి. హైందవ మతంలో ప్రకృతిని దేవీదేవతులుగా పూజించే విధానాన్ని చూస్తున్నాం. చెట్టునీ, పుట్టనీ, నిప్పునీ, నింగినీ, పశుపక్ష్యాదులను దేవీదేవతలుగా భావించి, భక్తితో ప్రకృతిని సేవించుకునే సంస్కృతివల్ల పర్యావరణ రక్షణకు కావలసిన శ్రద్ధ, భక్తి ప్రజల్లో వున్నంత కాలం మానవజాతి ఆరోగ్యంగా వుండేది.
అభివృద్ధి చెందిన దేశాలు తమ పరిధిలోని పంచభూతాలను గత శతాబ్దంగా భ్రష్టు పట్టించిన సంగతి ప్రపంచానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఇప్పటికే ఎంతో నష్టం జరిగిపోయింది. ‘డిస్పోజబు ల్ కల్చర్’ని ప్రపంచానికి నేర్పించి, ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్లుగా కోట్లకొ ద్దీ టన్నుల చెత్తను భూమికి భారం చేసిన పాపం పారిశ్రామీకరణదే. ‘4.5 బిలియన్ సం॥ల వయస్సున్న భూమికి ‘పట్టణీకరణ పారిశ్రామీకరణ’ గత 500 సం॥లుగా చేసిన చేటు అంతా ఇంతా కాదు.
భూమాతకు ఇవి గడ్డు రోజులుగా అభివర్ణించారు పర్యావరణ శాస్త్రవేత్తలు. పారిశ్రామీకరణ, పట్టణీకరణ వేగవంతంగా జరుగుతున్నకొద్దీ భూమి కలుషితం అవుతూ వస్తున్న ది. వర్షం కురిసిన వెంటనే వెలువడే పరిమళం, భూమిలోంచి బిలబిలమంటూ వచ్చే వానపాముల సముదాయం నేల ఆరోగ్యానికి గుర్తు! రసాయన ఎరువులు తాగించి, భూమి ఆరోగ్యాన్ని పాడు చేస్తు న్న పాపం మనదే. వానపాములు, ఇతర ఉపకార జీవులు భూమిలో జీవించే స్థితి ఏనాడో పోయింది. కాంక్రీటు రోడ్ల పాపం వల్ల నగరాల్లో కురిసిన వర్షపు నీరు భూమిలోకి ఇంకటం లేదు.
రోగనిరోధక శక్తిపైనా దుష్ప్రభావం
పంటల పెరుగుదల,రక్షణ కోసం వాడుతున్న రసాయనిక ఎరువులు, క్రిమి సంహా రక మందులవల్ల అభివృద్ధి చెందిన దేశా ల్లో రెండున్నర కోట్లమంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ విష పదా ర్థాలు తాకటం, తాగడం, ఆ గాలి పీల్చడం, అవి వాడిన ఆహార పదార్థాలను తినడం వంటివాటి కారణంగా అంతులేని అనారో గ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తలనొప్పి, చూపు మందగించటం, వాంతులు, కడుపు నొప్పి, లివర్ వ్యాధులు, అస్తమా, నరాలు క్యాన్స ర్ ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలను ఈ రసాయనాలు కలిగిస్తున్నాయి.
ఫ్యాక్టరీల రసాయనాలు భూమిలోకి విసర్జించటం వల్ల భూమి కలుషితమవుతోంది. ఈ భూమిపై పండిన పంటలు, కూరగాయలపైనా ఆ విష ప్రభావం వుంటున్నది. అవి తింటున్న వారిపై ఇదంతా ‘స్లో పాయిజన్’ లా పని చేస్తున్నది. ప్రజల ఆరోగ్యం రోగ నిరోధక శక్తులపైనా ఈ ప్రభావం వుండి తీరుతుంది.
సరస్సులు, జీవనదులు, చెఱువులలోని నీటిని ‘తాగునీటి’గా భావించే రోజులు ఏనాడో పోయాయి. మనం కొనుక్కున్న ‘సీసా నీరు’ మాత్రమే సురక్షితం అనే స్థితికి వచ్చాం. నీటి భూతంపై మనకెందుకింత భయం పట్టుకుంది? అంటే, పారిశ్రామీకరణ వల్లనే. పరిశ్రమల రసాయన పదార్థా లు భూమిని కలుషితం చేసాక, అవి చిన్నచిన్న కాలువలద్వారా, కురిసిన వర్షనీటి ద్వారా ప్రధాన నదులలోకి ప్రవేశిస్తున్నా యి. మంచినీటికి రంగు, రుచి, వాసన ఉండదు. కానీ, కలుషిత నీటికి రంగు మారుతుంది. దూరం నుంచే వాసన వస్తుంది.
నదులు, భూమిపై భక్తి గౌరవం, అవగాహన లోపించిన కారణంగా చేజేతు లా నీటిని ఇలా కలుషితం చేసుకొంటు న్నాం. నీరు కలుషితమై, నీటిలోని జంతువుల (చేపలు వంటివి)ను తినే వారికి కూడా ఈ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. నీటిలోకి చేరిన విష పదార్థాలవల్ల ఎన్నో జంతువులు చనిపోయి కుప్పలు తెప్పలు గా ఒడ్డుకి కొట్టుకొస్తున్నాయి. ఈ చేపలను తిన్న పక్షులు మరణిస్తున్నాయన్న విష యం వార్తాపత్రికల్లో చూశాం. వందలాది తిమింగలాలు మరణించిన వార్తకూడా చదివాం. అయినా, మనలో స్పందన లేదు.
నదుల కాలుష్యం సముద్రాలలోకి ప్రవేశించి మరింత నష్టాన్ని కలిగిస్తున్నది. కలు షిత సముద్రజలాల వల్ల ‘యాసిడ్ వర్షా లు’ వంటి వింతలు చూస్తున్నాం. ‘అభివృద్ధి చెందిన దేశాలు’ బాధ్యత లేకుండా వారి దేశాలలోని చెత్తను ఓడలద్వారా సముద్రాలలోకి విడవటంతో ప్రకృతిలో సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటోంది. సముద్ర జీవులు సర్వనాశనమవుతున్నా యి. జీవ వైవిధ్యం నశించిపోతున్నది. రెండు దశాబ్దాల క్రితం నీటిని సీసాల్లో అమ్ముతారని, అవే తాగుతామని ఊహించలేదు కదా! మంచి ‘గాలి’ కరువై ఆక్సీజన్ సిలిండర్లని మోసుకొని తిరిగే రోజులు రావని నమ్మకమేంటి?మంచి గాలిని కొని, పీల్చే రోజులు రాబోతున్నాయి.
ప్రమాదకర స్థాయికి కాలుష్యాలు
పర్యావరణ పరిరక్షణ మంత్రాన్ని జపిస్తూనే రోడ్ల విస్తరణ పేరిట కోట్లాది వృక్షాలను వ్రేళ్లతోసహా పెకిలించి వేస్తు న్నాం. 20 నుండి 60 ఏళ్లుగా పెంచుకొన్న ఈ వృక్షాలు లక్షల టన్నుల ఆక్సీజన్ను ప్రాణులకు అందిస్తున్నాయి. ఈ నిర్లక్షమే అతివృ ష్టికీ, అనావృష్టికీ, వేసవితాపం పెరగటానికీ కారణమైంది. చెట్లు విడుదల చేసే ‘ఆక్సీజన్’ని ఎంత ఖర్చు పెడితే సంపాదించగలం? ప్రాణికోటి విడిచిపెట్టిన కార్బన్- డై-ఆక్సైడ్తోపాటు పెట్రోల్, డీజిల్ వాహనాలు విడుదల చేసే విషకణాలూ వాతావ రణంలోకి చేరడంతో వాయువులు మరిం త కలుషితమవుతున్నాయి.
ఊపిరితిత్తులకీపీల్చే వాయువుకీ అవినాభావ సం బంధం ఉంటుంది. మనం ప్రతిరోజు 15-- వేల లీటర్ల గాలిని పీల్చి వదులుతాం. ఇందులో దాదాపు 21 శాతం ఆక్సీజన్, 78 శాతం నైట్రోజన్, మిగతావి కార్బన్-డై-ఆక్సైడ్, మిథేన్, జడవాయువులు వుంటా యి. ఈ కాలుష్యాలను పీల్చడం వల్ల ఆస్త మా, కొన్ని ఊపిరితిత్తుల వ్యాధులు వాటి లో ముఖ్యమైనవి. ఇవి కాక సిగరెట్, వంటచెరకు పొగలు, పెర్ఫ్యూమ్స్, అగర్బత్తీలు, సాంబ్రాణి పొగలు కలిసి వాయువుని మరింత కలుషితం చేస్తున్నాయి.
ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో ‘విటమిన్ లోపం వున్న జనాభా ఎక్కువవుతోంది. 70% ఇరుకు సందులు, సూర్యరశ్మి సోకని అపార్ట్మెంట్లలో నివా సం, రోజంతా సూర్యరశ్మి సోకని ఆఫీసుల లో పని చేయడం ఇందుకు కొన్ని కారణాలు. ప్రకృతి సిద్ధమైన ‘విటమిన్- మనకి సూర్యరశ్మి ద్వారానే లభిస్తుంది. ఎన్ని టాబ్లెట్స్ వేసుకొన్నా సూర్యరశ్మికి సరికాదు. సమస్త జీవరాశులకు ప్రాణాధారమైన సూర్యరశ్మి పంటల పెరుగుదలకీ, వాతావరణానికి, సూర్యునికి మధ్యనున్న ఓజోన్ పొర సూర్యరశ్మిలోని కొన్ని ప్రమాదకర కిరణాల్ని వడపోసి, ఆరోగ్యకరమైన సూర్యరశ్మిని మనకి అందిస్తుంది.
మానవులు చేస్తోన్న తప్పిదాలవల్ల కాలుష్యం పెరిగి, ఓజోన్ పొరకు చిల్లులు ఏర్పడి సూర్యరశ్మికూడా అనారోగ్య హేతువైంది. భూతాపం పెరిగిపోతున్నది. మరెన్నో వ్యా ధులకు కారణభూతమవుతున్నది. సునా మీ వంటి ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, అనావృష్టి, యు.వి. కిరణాలవల్ల చర్మ సంబంధ క్యాన్సర్లు రావటం, ఋతువులలో తేడా, జంతువుల ప్రవర్తనలో మార్పులు కలుగుతున్నాయి. వీటివ ల్ల మానవుల మానసిక, శారీరక ఆరోగ్యంపై దుష్ప్రభావం కలుగుతోంది. ఇవన్నీ అభివృద్ధి పేరిట జరుగుతున్న ప్రకృతి విధ్వం సం వల్ల పర్యావరణలో మార్పుల వల్ల జరుగుతోన్న నష్టాలు.
భవిష్యత్ తరాలకు భరోసా ఇద్దాం
పంచభూతాల పరిరక్షణే మానవాళికి ఆరోగ్యదాయకం. మానవ తప్పిదాలను నివారించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అడవులను నరికి వేయటం తక్షణమే ఆపా లి. వృక్షాలను అధికంగా పెంచాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప, చెట్లను కొట్టకూడ దు. డిస్పోజబుల్ కల్చర్కు, ప్లాస్టిక్ వాడకానికి స్వస్తి పలకాలి. వాయు, శబ్ద, నీటి కాలుష్యాలను అరికట్టడానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలి. ఇందుకుగాను ప్రజలు ప్రభుత్వాలకు సహకరించాలి. రసాయన వ్యర్థాలు జీవనదులలోకి వెళ్లకుండా నిషేధం వుండాలి.
ప్రకృతిని తల్లిగా భావించే పాత తరాల భయం, భక్తి పునరుద్ధరింపబడాలి. ఎవరికి వారు బాధ్యతతో కర్తవ్యాల్ని నెరవేరుస్తూ, పంచభూతాలను పరిరక్షించినప్పుడే అందరికీ ఆరోగ్యం సాధ్యమవుతుంది. ఇది ప్రభుత్వం ఒక్కటే చేయలేదు. ప్రభుత్వ సూచనలతో ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీఓలు) అందరూ కలిసి కట్టుగా చేయాలి. ప్రజలు పర్యావరణంపై అవగాహన పెంచుకొని, బాధ్యతతో మెలగాలి. ముంచుకొస్తున్న ఈ ఉపద్రవం నుం డి భవిష్యత్ తరాలను కాపాడాలి, ఇకనైనా మేల్కొనండి! మేలు కొలపండి! మేలు తల్చండి! మేలు చేయండి! పంచభూతాలను పరిరక్షించండి.
వాతావరణ కాలుష్యాన్ని అరికట్టే విషయంలో ‘శ్వాస ఫౌండేషన్’ గత 20 సం॥ లుగా తన వంతు కృషి చేస్తున్నది. వివిధ టి.వి. ఛానళ్లు, వార్తా పత్రికలు, కరపత్రా లు, శిబిరాల ద్వారా ‘ఇండోర్, ఔట్డోర్’ కాలుష్యాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తు న్నాం. పాఠశాలలు, కర్మాగారాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులను మా వం తు ప్రయత్నంగా నిర్వహిస్తున్నాం.
శ్వాస ఫౌండేషన్,
నారాయణగూడ, హైదరాబాద్