21-06-2025 12:04:38 AM
మహబూబ్ నగర్ జూన్ 20 (విజయ క్రాంతి) : విధి నిర్వహణలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండి ఎప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా చూడవలసిన బాధ్యత పోలీసులపై ఉందని మల్టీజోన్ - ll ఐజి సత్యనారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జోగుళాంబ జోన్-VII, డిఐజి ఎల్.ఎస్.చౌహాన్ సమన్వయంతో జోగుళాంబ జోన్ ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూఎస్కార్ట్ డ్యూటీలు, భద్రతా ప్రామాణి కాలు, సమన్వయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.ప్రధానంగా ఖైదీల ఎస్కార్ట్ డ్యూటీల నిర్వహణ, భద్రతా చర్యలు, జైలు, కోర్టు మధ్య సమన్వయం, అనుమానాస్పద కార్యకలాపాల పర్యవేక్షణ, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఖైదీలను ఆసుపత్రులతోపాటు ఇతర ప్రాంతాలకు తీసుకు వెళుతున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు.
అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇంథనల్ కంపెనీకి సంబంధించి విషయంలో రైతులకు బేడీలు వేసిన విషయంలో పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తామన్నారు. ప్రతి ఒక్కరి ప్రొఫైల్ సమగ్రంగా తయారు చేయడం జరుగుతుందని తెలియజేశారు.
ఒక ఖైదీ తప్పించుకున్న పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని, ఈ నేపథ్యంలోనే ఖైదీ లకు అవసరమైన భద్రత కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి, నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్, వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ తోట శ్రీనివాస్ రావు, నారాయన్ పేట ఎస్పీ యోగేష్ గౌతం, జోగుళాంబ జోన్-VII పరిధి ఇతర పోలీసు అధికారులుపాల్గొన్నారు.