20-06-2025 01:12:03 AM
ముగ్గురికి తీవ్ర గాయాలు,ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలింపు
ఎల్లారెడ్డి జూన్ 19,(విజయ క్రాంతి): హైదరాబాద్ మెదక్ ప్రధాన రహదారి బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్లారెడ్డి మండలంలోని మల్లయపల్లి గ్రామ సమీపంలో, ప్రధాన రహదారి పై నిర్మాణం జరుగుతున్న బ్రిడ్జ్ పనులు కాంట్రాక్టర్ తన పనుల్లో నిర్లక్ష్యం, పనులు జరుగుతున్న ప్రదేశంలో సూచిక బోర్డులు పెట్టకపోవడమే ఆ ప్రమాదానికి కారణమని ప్రాంతవాసులు మృతి చెందిన కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్లయ్యపల్లి వద్ద జరిగిన కారు ప్రమాదంలో మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నర్సింగ్ రావు పల్లి తండాకు చెందిన, వ్యక్తులు నిజాంబాద్ జిల్లాలోని వర్ని మండలానికి కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు శుభకార్యముకు బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యలో బ్రిడ్జి నిర్మాణం సూచిక బోర్డు లేక అదుపుతప్పి, లోయలో పడి, అక్కడికక్కడే ఇద్దరు మృతి, ముగ్గురు పరిస్థితి విషమం, క్షతగాత్రులు ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి స్థానికులు తరలించారు.
మృతి చెందిన వారిలో, పీర్య (32), మరో వ్యక్తి పీర్య (38) అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలు పాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి హెచ్ఎంబి జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణం అంటూ మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్లు సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా, నిర్లక్ష్యంగా చేపట్టిన పనుల వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని వారు కాంట్రాక్టర్ తీరుపై మండిపడుతున్నారు. తమకు న్యాయం చేసే వరకు ఆందోళన నిర్వహిస్తామని హెచ్ఎంవి ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపడుతున్నారు.