20-06-2025 01:12:13 AM
సర్కారు బడుల్లో చేరిన 1.5లక్షలమంది విద్యార్థులు
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): బడిబాట కార్యక్రమం ముగిసింది. ఈ నెల 6న ప్రారంభమైన బడిబాట కార్యక్రమం 19 వరకు తొలివిడుతగా కొనసాగింది. బడీడు పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏటా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ పిల్లలకు సర్కారు బడుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఇప్పటి వరకు సుమారుగా 1.5 లక్షల మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చేరినట్లు అంచనా. చివరి రోజు కావడంతో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఒకటో తరగతిలో గత మంగళవారం వరకు 60 వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.