అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం
కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం 12వ డివిజన్ లో పర్యటించి డిప్యూటీ మేయర్ ఎంఎస్ఆర్ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం జాండ్ర సంఘం వారి శ్మశానవాటికలో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపిన సంఘం సభ్యులు వెంటనే వాటిని ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.
ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రతి సమస్యను గుర్తించాలని విడుదల వారీగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదాం అని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్వ సత్యం, శ్రవణ్ కుమార్, మైత్రి యాదయ్య, మద్దురి రాఘవేందర్, లీడర్ రఘు, జాండ్ర సంఘం అధ్యక్షుడు బాలరాజ్, మహిళ అధ్యక్షురాలు ప్రసన్న లక్ష్మీ, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.




