1 April, 2026 | 6:35 PM

Breaking News

మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత   •   కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు   •   అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత   •   అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •   మంథనిలో రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయండి   •  

అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం

01-04-2026 04:41 PM

కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం 12వ డివిజన్ లో పర్యటించి డిప్యూటీ మేయర్ ఎంఎస్ఆర్ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం జాండ్ర సంఘం వారి  శ్మశానవాటికలో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపిన సంఘం సభ్యులు వెంటనే వాటిని ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.

ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రతి సమస్యను గుర్తించాలని విడుదల వారీగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదాం అని సూచించారు.  ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్వ సత్యం, శ్రవణ్ కుమార్, మైత్రి యాదయ్య, మద్దురి రాఘవేందర్, లీడర్ రఘు,  జాండ్ర సంఘం అధ్యక్షుడు బాలరాజ్, మహిళ అధ్యక్షురాలు ప్రసన్న లక్ష్మీ, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.