కామారెడ్డి రూరల్ సిఐగా పల్లె శ్రీధర్ గౌడ్
01-04-2026 04:36 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి రూరల్ సీఐగా పల్లె శ్రీధర్ గౌడ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. కామెడీ రూరల్ సిఐగా పనిచేసిన రామన్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో సిద్దిపేట సి ఎస్ బి లో పనిచేసిన శ్రీధర్ గౌడ్ కామారెడ్డి రూరల్ సీఐగా బదిలీ అయ్యారు. బుధవారం రూరల్ సీఐగా పల్లె శ్రీధర్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. వారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలుకుతూ సదాశివ నగర్ మండల్ సీఎం విఎస్ అబ్దుల్ లతీఫ్, సీనియర్ సిటిజన్ కౌన్సెలింగ్ ఆఫీసర్ షేక్ అలీముద్దీన్ లు కలిసి పుష్పగుచ్చం అందజేశారు.




