2 May, 2026 | 9:14 PM

Breaking News

సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •  

ఇల్లందు ఏరియాలో పర్యటించిన కార్పొరేట్ జీఎం (ఎస్టేట్)

02-05-2026 08:08 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి కార్పొరేట్ జనరల్ మేనేజర్ (ఎస్టేట్) లక్ష్మిపథి గౌడ్ శనివారం ఇల్లందు ఏరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా నూతన జే కే కోల్ మైన్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాలను పరిశీలించారు. ప్రాజెక్టు పరిధిలో కొత్తగా నిర్మించిన రోడ్లు, జరుగుతున్న పనులను సమీక్షించారు. పనుల పురోగతిపై ఏరియా జీఎం వి. కృష్ణయ్యని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతన ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.