25-06-2025 12:55:56 AM
కరీంనగర్, జూన్24(విజయక్రాంతి):కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరి గాయని నాణ్యత లోపంతో నిర్మాణం చేశారనే విషయం పై విచారణ జరుగుతుండటం ప్రజల కళ్ళకు కనబడుతుందని కరీంనగర్ న గరపాలక సంస్థ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లో మంగళవారం రోజు విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ.... కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల క మలాకర్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై వాఖ్యలు చేయ డం హాస్యాస్పదం అన్నారు.
ఎమ్మెల్యే గంగు ల కమలాకర్ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సాక్షాత్తు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి గా పని చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జస్టిస్ ముందు విచారణ ఎదుర్కోవల్సి వచ్చిందం టే దేనికి నిదర్శనమో గంగుల చెప్పాలని ప్రశ్నించారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు గత రెండు సంవత్సరాల కాలం నుండి ఏ స్థాయిలో ఉందో ప్రజలందరికి తెలుసని అ న్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మొదటి నుండి ఒకే విధంగా మాట్లాడుతున్నారని...జరిగిన వాస్తవాల పై మాత్రమే వా ఖ్యలు చేస్తున్నారని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రెండు సంవత్సరాలు వాడుకలో లేకపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఏ వి ధంగా పంటలు పండాయో అన్న విషయా న్ని సంజయ్ స్పష్టంగా చెప్పడం జరిగిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే బీఆర్ ఎస్ పార్టీ ఏమైనా ట్యాంకర్ల ద్వారా ఇంటింటికి, పంటలకు సరఫరా చేశారా...? అన్న విషయాన్ని గంగుల కమలాకర్ తెలుపాలని ఎద్దేవ చేశారు.
పై నుండి ఎల్లంపల్లి ప్రాజెక్టు వచ్చిన నీరు ఉందో అవి మిడ్ మానేరు, మ ల్లన్న సాగర్, రంగనాయక సాగర్, లోయర్ మానేరు నుండి సూర్యపేట, కోదాడ వరకు నీరు సరఫరా అయిన మాట వాస్తవమా కా దా అని నిలదీసారు. రెండు సంవత్సరాలు కాళేశ్వరం లేకున్నా నీరు ఎక్కడి నుండి వ చ్చిందని ప్రశ్నించారు. ప్రాజెక్టులు కట్టడాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు కానీ...నిర్మాణం లో దరిగిన అవకతవకల పై బీజేపి స్టాండ్ ఏ మిటనే విషయాన్ని బండి సంజయ్ గారు స్పష్టం చేశారని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన ఇంజనీర్లు ఏ విధంగా అవి నీతి నిరోధక శాఖ చుట్టు తీరుగుతున్నారో ప్రజలందరికి మండి పడ్డా రు. వందల కోట్ల ఆస్తులతోటి అధికారులు ఏ విధంగా పట్టు బడుతున్నారో ప్రజలకు క నబడుతుందని అన్నారు. ఎక్కడి నుండి అం త డబ్బు అధికారుల చేతికి వచ్చిందో ఎ మ్మె ల్యే గంగుల కమలాకర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిని తేల్చ డం కాంగ్రెస్ ప్రభుత్వంతో కాకపోతే సెంట్ర ల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కు అప్పగించాలని బండి సంజయ్ కోరారని గుర్తు చేశా రు.
కరీంనగర్ నియోజకవర్గం కట్టిన చెక్ డ్యాంలు ఎన్ని కొట్టుకు పోయాయో ఎంత ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని డి మాండ్ చెయ్యాలని అన్నారు. 221 కోట్లతో నగరంలో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది... ప్ర స్తుతం కేబుల్ బ్రిడ్జ్ పై నుండి వాహానాలు నడిచే పరిస్థితి లేదు... దానికి కారణం ఎవరు వంతెన అలా కావడానికి కారకులు ఎవరు అన్న విషయం పై విచారణ జరపాలని ప్ర భుత్వాన్ని డిమాండ్ చేయాలే. గత నాలుగు సంవత్సరాల కాలంగా మానేరు రివర్ ఫ్రం ట్ అంటూ కలవర పడ్డారు కదా.... రివ ర్ ఫ్రంట్ పనులు ఎలా సాగుతున్నాయి.... వా టిలో ఎక్కడ నాణ్యత లేదు... అధికారుల అం చనాలు సరిగా లేవు... అవినీతి జరుగుతుంది అనే విషయాల మీద విచారణ జరపాలని గంగుల కమలాకర్ ఎందుకు డిమాండ్ చే యరు అని నిలదీశారు. సమావేశంలో బీజే పి మాజీ కార్పొరేటర్లు, నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.