25-06-2025 12:56:02 AM
నిజామాబాద్ సీపీ సాయి చైతన్య వచ్చే 6 నెలలలో ప్లాన్ అఫ్ యాక్షన్
నిజామాబాద్ జూన్ 24: (విజయ క్రాంతి): ప్రతి కేసులో నాణ్యమైన ధర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలి చేయడంతో పాటు లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేపట్టాలని నిజాంబాద్ సిపి సాయి చైతన్య జిల్లా పోలీస్ సిబ్బందినీ ఆదేశించారు.
ముఖ్యంగా డ్రగ్స్ కేసుల విషయంలో కఠినంగా వ్యవహరించి డ్రగ్స్ నుండి యువతను కాపాడే దిశగా ఎవర్నస్ క్యాంపులు ఏర్పాటు చేసి మత్తు పదార్థాల రావణ పై ఉక్కు పాదం మోపాలని సిబ్బందిని ఆదేశించారు సైబర్ క్రైమ్ గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించ డం తో పాటు నెల వారి సమీక్ష సమావేశం లో నిజామాబాదు డివిజన్ అధికారులకు పలు సూచనలు : పోలీస్ కమీషనర్ సాయి చైతన్య, చేశారు.
మంగళవారం నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం కమిషనరేటు పరిధిలోని నేరాల నియంత్రణ కొరకు సంబంధిత నిజామాబాదు డివిజన్ ఎ.సి.పి , సి.ఐలు, ఎస్.హెచ్.ఓలు ఎస్.ఐలతో సిపి సమీక్ష సమావేశం వహించారు.
వచ్చే ఆరు నెలలలో ప్రతి ఎస్హెచ్ఓ లక్ష్యాలు పెట్టుకొని నేరాల నియంత్రణ కోసం ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని ఇందులో ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణ నేరాల నియంత్రణ కోసం పూర్తిగా కంట్రోల్ ఉండేవిధంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి బందోబస్తును సమర్థవంతంగా నిర్వహించేటట్లు సిబ్బందికి సంబంధించిన వెల్ఫేర్ మొదలగునవి ఒక ప్రణాళిక ప్రకారంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిర్వహించాలన్నారు.
ప్రాపర్టీ అఫెన్సులలో ఉన్న ట్రెండ్ అర్థం చేసుకొని పాట్రోలింగ్ విధానంలో మార్పుల గురించి క్షుణ్ణంగా ఇబ్బందితో ఆయన చర్చించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రతి ఎస్ హెచ్ ఓ అధికారికి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ చోట రోడ్డు ప్రమాదాలు జరగకుండా కావలసినటువంటి ఏర్పాట్లు చేసి, రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నియంత్రించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల నీ అధికారులకు సూచించారు.
పోలీస్ స్టేషన్ ల వారిగా పెండింగ్ లో ఉన్న కేసులను క్షుణ్ణంగా సమీక్షించి త్వరితగతిన దర్యాప్తు ముగించడానికి తగిన సూచనలు సిపి సాయి చైతన్య ఇచ్చారు. మహిళల భద్రతకోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, వారికి అన్ని రకాల భద్రతల విషయంలో ఎల్లప్పుడు సహాకారాం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. గేమింగ్ యాప్ల పట్ల ప్రజలు మెసపోకుండా ఎప్పటికప్పుడు వారికీ అవగాహనా కార్యాక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి మొదలగు చట్టవ్యతిరేక కార్యాకలాపాలపై ప్రత్యేకమైన ‘ నిఘా ‘ ఏర్పాటు మరియు లాడ్జీలలో ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేయడం పెండింగ్ లో ఉన్నఎన్. బి. డబ్ల్యూస్ల పై ప్రత్యేకంగా డివిజన్ పరిధిలో టీమ్స్ ఏర్పాటుచేసి త్వరితగతిన ఎగ్జిక్యూట్ ఎలా చూడాలన్నారు. ముఖ్యంగా గ్రేవ్ కేసులలో చాలా రోజులలో పెండింగ్లో ఉన్న ఎన్.బి.డబ్ల్యూ చేయాలన్నారు. అవసరం అయితే ఎల్.ఓ.సి లు పెట్టాలన్నారు.
సైబర్ మోసాల నియంత్రన కోసం 1930 ఫోన్ నెంబర్ గురించి ప్రజలకు అవగాహణ కల్పించాలి. అన్ని పోలీస్ స్టేషన్ పరిదులలో ‘ పెట్రోలింగ్ ముమ్మరం చేయడం, బీట్ల ఏర్పాటు, రాత్రి సమయా లలో వాహనాల తనిఖీ చేసి దొంగ తనాల నివారణకు కృషి చేయుట. ఎటువంటి చిన్న నేరాలు జరుగకుండా సంబంధిత అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో‘ నిఘా వ్యవస్థ పటిష్ట పర్చడము .
డయల్ 100 ఫిర్యాదుల పట్ల త్వరితగతిన స్పందించాలని అన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) శ్రీ బస్వారెడ్డి , ఎ.సి.పిలు, సి.ఐలు, ఎస్.ఐలు మరియు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీ శ్రీశైలం పాల్గొన్నారు.