25-06-2025 12:53:56 AM
కరీంనగర్ క్రైం, జూన్24(విజయక్రాంతి):డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ ద్వారా ప్ర త్యేక చర్యలు తీస్కోవడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి, పారిశుద్యంలో భాగంగా మంగళవారం రో జు ఉదయం కమీషనర్ అధికారులతో కలిసి నగరంలో పర్యటించారు. పలు ప్రాంతాల్లో డంపింగ్ యార్డు కోసం స్థలాల అన్వేషణ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను తనిఖీ చేసి పరిశీలించారు.
మొదటగా నగరంలోని జ్యోతిబా పూలే పార్కును సందర్శించి... పారిశుధ్యం, పార్కు నిర్వహణను పరిశీలించారు. గ్రీనరి, మొక్కల సంరక్షణ చేపడు తూ... పార్కు నిర్వహణ సక్రమంగా చేయాలని నిర్వహాకులను ఆదేశించారు. అనంతరం మంచిర్యాల చౌరస్తా, ఆదర్శనగర్ లో పారిశుధ్య పనులను పరిశీలించారు. పరిసరాల పై చెత్త వేసిన మెడికల్ షాపుకు జరిమాన విధించాలని ఆదేశించారు. అనంతరం డంపింగ్ యార్డు స్థల అన్వేషణ లో భాగంగా చింతకుంట, మల్కాపూర్ డంపింగ్ యార్డులను సందర్శించి పరిశీలించారు. డంపింగ్ యార్డుల స్థల వివరాలను అడిగి తెలుసుకొని అధికారులకు సలహాలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమీషనర్ ప్రఫుల్ దేశా య్ మాట్లాడుతూ... నగర ప్రజలకు డంపింగ్ యార్డు సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చింతకుంట, మల్కాపూర్ డంపింగ్ యార్డులను సర్వే చేయాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తి చే సి డంపింగ్ యార్డు విస్తీర్ణం వివరాలను అందించడంతో పాటు వాటి హద్దులను ఫిక్స్ చేయాలని కోరారు. అంతే కా కుండా నగర పారిశుధ్య పనుల పై అధికారులు సిబ్బంది ని ఆదేశించారు. నగర పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చెత్త కనబడకుండ అధికారులు సిబ్బంది చర్యలు తీస్కోవాలన్నారు.
ఎక్క డైన చెత్త కనిపిస్తే సంబంధిత అధికారుల పై చర్యలు తప్పవన్నారు. చెత్త రోడ్లు, పరిసర ప్రాంతాల్లో వేయకుండ చూడా లని... ఎవరైన చెత్తను ఎక్కడ పడితే అక్కడ నేస్తే వారికి జరిమానా విధించాలని ఆదేశించారు. ఎక్కడ చెత్త పడిన ఎప్ప టికప్పుటు లిఫ్ట్ చేసి తరలించాలని కోరారు. ప్రతి స్వచ్చ్ ఆటో లు, ట్రాక్టర్లలో చెత్త వేరు చేయబడిన తర్వాతే డంపింగ్ యా ర్డుకు తరలివెల్లాలని అధికారులను కోరారు. నగర వ్యాప్తంగా సెక్రిగేషన్ ప్రక్రియ సమర్థవంతంగా జరిగితేనే డంపింగ్ యార్డుకు చెత్త తగ్గుతుందని.... ఆ దిశగా తగిన చర్యలు తీస్కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ వేణు మాధవ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామీ తదితరులు పాల్గొన్నారు.