calender_icon.png 30 June, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట మున్సిపాలిటీలో సమైక్యత వజ్రోత్సవాల్లో రూ.7.5 లక్షల అవినీతి

30-06-2025 03:22:47 AM

సిద్దిపేట, జూన్ 29 (విజయక్రాంతి): సిద్దిపేట మున్సిపాలిటీలో అవినీతి రాజ్యామేలుతుందని 38 వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ధర్మవరo బ్రహ్మం ఆరోపించారు. ఆదివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ 2022లో జరిగిన తెలంగాణ సమైక్యత వజ్రత్సవాళ్ళో దాదాపు రూ.7.5 లక్షల అవినీతి జరిగిందన్నారు. సిద్దిపేట మున్సిపల్ అధికారులు వజ్రత్సవాలకు సంబంధించిన ఖర్చు రూ.30లక్షలు చూపేట్టారని వాటికి సంబందించిన బిల్లులు కలెక్టర్ కార్యాలయానికి అందించగా రూ.7.50 లక్షలు, రూ.15 లక్షలు రెండు చెక్కుల రూపంలో అందించారన్నారు.

మిగతా రూ.7.5 లక్షలు క్యాష్ రూపంలో అందించారని అధికారులు స్వయంగా ఆర్ టి ఐ దరఖాస్తూ ద్వారా తెలిపారని అన్నారు. మున్సిపల్ ఎజెండాలో కే వలం రెండు చెక్కులు రూ. 22.50లక్షలు మాత్రమే చూపించారని, మరి క్యాష్ రూపంలో వచ్చిన రూ.7.50 లక్షలు ఎందుకు చూపెట్టలేదని ప్రశ్నించారు. ఆ నగదు రూపంలో ఉన్న డబ్బులు ఎటు వెళ్ళాయన్నారు. ఇలాంటి అవినీతి సిద్దిపేట మున్సిపాలిటీలో ఇది మచ్చుకు మాత్రమేనని, మరెన్నో ఉన్నాయన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ అధికారులపై సిబిఐ, విజిలెన్స్ తో సమగ్ర విచారణ జరిపించాలనీ డిమాండ్ చేశారు.