30-06-2025 03:25:35 AM
సిటిజన్ ఫోరం సభ్యుల డిమాండ్
మెదక్, జూన్ 29(విజయక్రాంతి): మెదక్ మున్సిపల్ పరిధిలోని అన్ని ఆవాస ప్రాంతాలలో డ్రైనేజీ, సిసి రోడ్ల సౌకర్యాలు కల్పించాలని మెదక్ సిటిజన్స్ ఫోరం కోరింది. ఆదివారం ఫోరం పలు కాలనీలలో పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈశ్వర్ నగర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన ఇంటిముందు గుంతలు తీసుకుని మురుగు నీటిని నిలువ చేసుకోవడం వల్ల ఈ వర్షాకాలంలో మురుగు నీరు అంతా రోడ్లపై ప్రవహిస్తుందని తెలిపారు.
కొత్తగా వెలిసిన కాలనీలలో సిసి రోడ్ల ను వేయాలని, పార్కులన్నింటినీ పిల్లలు ఆడుకోవడానికి కావలసిన పరికరాలు ఏర్పాటు చేయాలని, పందుల సంచారం వల్ల అపరిశుభ్రంగా మారుతున్నాయని తెలిపారు. పిల్లి కొట్టాల ప్రాంతంలో గల డబుల్ బెడ్ రూమ్ ప్రాంతంలో సీసీ రోడ్లను ఏర్పాటు చేయాలని, అన్ని ఇండ్లకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని కోరారు.
బస్తి ద వాఖన కు నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన డాక్టరు, సిబ్బంది కనీస అవసరాలను తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మెదక్లో విపరీతమైన కోతుల బెడద వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కోతుల నుండి రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ సిటిజన్స్ ఫోరం సభ్యులు కొండల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఆనందం, నరసింహులు గౌడ్, దశరథం, బాలేష్ గౌడ్, సామ్యూల్, దయాసాగర్, బొందుగుల నాగరాజు ఉన్నారు.