16 April, 2026 | 10:05 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

పత్తి కొనుగోలు సీసీఐ తిరకాసు

24-02-2026 01:02 AM

ఆదిలాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): పత్తి పండించే అన్నదాతకు కష్టాలు వీడటం లేదు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలతో దిగుబడి తగ్గి కుదేలవుతుంటే, మరోవైపు ప్రభుత్వ కొనుగోలు సంస్థ ‘కాటన్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియా’ (సీసీఐ) విధిస్తున్న కఠిన నిబంధనలు రైతులను కుంగదీస్తున్నాయి. నాణ్యత, తేమ శాతం పేరిట అధికారులు పెడుతున్న కొర్రీలతో మద్దతు ధర దక్కక రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. పత్తి కొనుగోళ్లలో  సీసీఐ గడువు పెంచినప్పటికీ నాణ్యత పేరిట కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు.

ఈనెల 20 వరకే పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ ప్రకటించినప్పటికీ ఆ గడువురు ఈనెల చివరికి పెంచింది. కిసాన్ యాప్‌లో రైతులు స్లాట్ బుక్ చేసుకొని మార్కెట్ యార్డ్ కు రాగా నాణ్యత పేరిట కొనుగోలులకు సీసీఐ అధికారులు ముందుకు రాలేదు. సోమవారం ఒకే బండి కాటా చేయడంతో రైతులు మార్కెట్ యార్డ్‌లో నిరసన వ్యక్తం చేశారు. పత్తి నాణ్యతగా ఉన్నా కూడా కొనుగోళ్లకు పాసింగ్ ఇవ్వ డం లేదని మండిపడ్డారు. రైతులకు అండగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిన్ రెడ్డి సీసీఐ అధికారులతో మాట్లాడా రు. ఎలాంటి తిరకాసులు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.