17-06-2025 12:38:58 AM
యాదాద్రి భువనగిరి జూన్ 16 ( విజయ క్రాంతి ): తమ ప్రేమను పెద్దలు ఎక్కడ కాదంటారని అనుమానంతో ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘోరం చోటుచేసుకుంది.సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి జనగాం జిల్లా స్టేషన్ ఘనపురం మండలం నెమిలి కొండ గ్రామానికి చెందిన మచ్చ శృతి (23), కే వినయ్ కుమార్ లు (25) గత కొంతకాలంగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు.
ఒకరికొకరు ఇష్టపడడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మధ్యకాలంలో వీరి ప్రేమ విషయం ఇరువురి పెద్దలకు తెలిసింది. ఇక తమ ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించరని భావించి అనుమానించారు. ఈ నేపథ్యంలో ఇంటి నుండి పారిపోవడమే సరైనదని ఆదివారం రాత్రి ఆ ప్రేమ జంట ఇంటి నుండి బయలుదేరి యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరుకున్నారు. బతికుండి కలిసి జీవించలేము.
కలిసి అయిన చనిపోదామని నిర్ణయించుకున్న ఆ ప్రేమికులు తెల్లవారుజామున భువనగిరి పట్టణ శివారులో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం వారి శవాలను గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకై భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.