17-06-2025 12:39:41 AM
-ఇరాన్లో 224 మంది.. ఇజ్రాయెల్లో 24 మంది మృతి
-అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి తప్పుకొంటున్నట్టు ఇరాన్ ప్రకటన
- ఇజ్రాయెల్లో అమెరికా రాయబార కార్యాలయం మూసివేత
- ఇరాన్ నుంచి సురక్షిత ప్రాంతాలకు భారతీయ విద్యార్థులు
- బంకర్లో అయతొల్లా ఖమేనీ!
టెహ్రాన్/టెల్ అవీవ్, జూన్ 16: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్లోని సైనిక స్థావరాలు, అణు శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులు నిర్వహిస్తుండగా.. మరోపక్క ప్రతీకార దాడులతో ఇరాన్ రెచ్చిపోతోంది. నాలుగు రోజులుగా సాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు పరస్పర దాడుల్లో ఇరాన్లో 224 మందికి పైగా మృత్యువాత పడగా.. 1200 మందికి పైగా గాయపడ్డారు.
మరోవైపు ఇజ్రాయెల్లో 24 మంది మరణిం చగా.. గాయపడిన వారి సంఖ్య 500కు పైనే ఉన్న ట్టు ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) ప్రకటించింది. మరణించిన వారిలో సాధారణ పౌరులే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయె ల్ జరిపిన వైమానిక దా డిలో ఇరాన్ రెవల్యూషన రీ గార్డ్లోని బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ కజె మి, డిప్యూటీ హసన్ మె హాకిక్ సహా మరో ఇద్దరు కీలక నేతలు మృతి చెం దారు.
14 మందికి పైగా ఇరాన్ అణు శాస్త్రవేత్తలు కూడా మరణించిన ట్టు ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్తో ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు సోమవారం స్ప ష్టం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిలీ బాఘై ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో టెహ్రాన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అయితే విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భారత ఎంబసీ పేర్కొంది. సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్పై చేసిన ఇరాన్ చేసిన క్షిపణి దాడులు టెల్ అవీవ్ను అతలాకుతలం చేయగా.. ఆ దేశంలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని కూడా తాకాయి. ఎంబసీ కార్యాలయం స్వల్పంగా దెబ్బతినడంతో తక్షణమే టెల్ అవీవ్, జెరూసలెంలోని కార్యాలయాలను మూసివేస్తున్నట్టు అమెరికా దౌత్యవేత్త మైక్ హకేబీ ధృవీకరించారు.
దాడులు తీవ్రమైన నేపథ్యంలో ఇజ్రాయెల్ గగనతలం సహా ఎ యిర్పోర్టులను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కుటుంబం తో కలిసి టెహ్రాన్లోని అండర్ గ్రౌ ండ్ బంకర్లో తలదాచుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇరా న్ అధికారిక టీవీ ఐఆర్ఐబీ యా ంకర్ ప్రత్యక్షప్రసారంలో వార్తలు చదువుతుండగానే.. స్టూడియోపై దాడి జరిగింది. ఈ ఘటనతో ఐఆర్ఐబీ తన ప్రత్యక్షప్రసారాన్ని నిలిపివేసింది.
ఆందోళనలో భారతీయ విద్యార్థులు
ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. పేలుడు శబ్దాలు, సైరన్ల మోతతో నిరంతరం అట్టుకుడుతోంది. దీంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇరాన్లో 10వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు వివిధ యూనివర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ‘మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి’ అని చాలా మంది విద్యార్థులు భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.
పరిస్థితి తీవ్రమైన వేళ భారత ప్రభుత్వం ఇప్పటికే ఇరాన్ అధికారులతోనూ సంప్రదింపులు జరిపింది. విద్యార్థుల తరలింపునకు భారత్ చేసిన అభ్యర్థనను టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం గగనతలం మూసివేసినందున భూసరిహద్దుల మీదుగా తీసుకెళ్లొచ్చని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరాన్కు సరిహద్దు దేశాలైన తుర్క్మెనిస్థాన్, అఫ్గానిస్థాన్ మీదుగా భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
టెహ్రాన్లోని షాహిద్ యునివర్సిటీలోనే దాదాపు 350 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. అయితే ఈ పరిణామాలపై నిరంతరం పర్యవేక్షిస్తున్న ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన విడుదలే చేసింది. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. దాడులు జరగుతున్న ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించామని, మిగతావారిని వీలైనంత త్వరగా తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు.
‘శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు శబ్దాలతో నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచా. చాలా మంది బంకర్లకు పరిగెత్తాం. నాలుగు రోజుల నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. ప్రతీ రాత్రి భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. భయంభయంగా బతుకుతున్నాం. మమ్మల్ని తీసుకెళ్లిపోండి’ అంటూ భారతీయ వైద్య విద్యార్థి ఇంతిసాల్ మొహిదీన్ కన్నీరుమున్నీరు అయ్యారు.
అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి గుడ్ బై
ఇజ్రాయెల్తో యుద్ధం కొనసాగుతున్న వేళ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) నుంచి వైదొలిగేందుకు సిద్ధమవుతున్నట్టు ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు తమ దేశ పార్లమెంట్లో ఒక బిల్లును సిద్ధం చేస్తోందని విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిలీ బాఘై వెల్లడించారు.
సాముహిక జనహనన ఆయుధాల తయారీని తమ దేశం మొదటి నుంచి వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల వేళ ఎన్పీటీ నుంచి మాత్రమే కాకుండా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) సభ్యత్వం నుంచి పక్కకు జరిగే అంశాన్ని కూడా ఇరాన్ పరిశీలిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమం 1950వ దశకంలో నాటి పాలకుడు షా రెజా పలావీ హయాంలో అమెరికా సహకారంతో ప్రారంభమైంది. 1958లో ఇరాన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థలో సభ్యత్వం పొందింది.
అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇరాన్ 1968లో సంతకం చేయగా.. 1970లో ఆ దేశ చట్టసభ దీనిని ఆమోదించింది. అదే ఏడాది ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం సంతకం చేసిన ఏ దేశం కూడా అణ్వాయుధాలను తయారు చేయడం, సమకూర్చుకోవడం, బదిలీ లాంటివి చేయకూడదు.
బంకర్లోకి ఇరాన్ సుప్రీం లీడర్!
ఇజ్రాయెల్ భీకర దాడులతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. ఈశాన్య టెహ్రాన్లోని అండర్గ్రౌండ్ బంకర్లో ఖమేనీ తన కుటుంబంతో కలిసి తలదాచుకుంటున్నట్టు సమాచారం. ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మోనిరియే ప్రాంతంలో ఇజ్రాయెల్ గత శుక్రవారం వైమానిక దాడులు జరిపింది.
ఖమేనీ నివాసానికి అత్యంత సమీపంలోనే ఈ పేలుళ్లు జరగడంతో అదేరోజు రాత్రి ఆయన్ను లావిజాన్లోని బంకర్కు తరలించినట్టు అంతర్జాతీయ కథనాలు వచ్చాయి. ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడుల్లో ఇరాన్ వైపు భారీ నష్టమే వాటిల్లినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ దేశ కీలక సైన్యాధికారులు సహా 14 మంది అణుశాస్త్రవేత్తలు మరణించారు.