16-01-2026 11:23:23 AM
లక్షెట్టిపేటలో విషాదం...
లక్షెట్టిపేట టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణానికి చెందిన జనరల్ స్టోర్ యజమాని పాలకుర్తి సత్యనారాయణ(63), రమాదేవి (59) దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది... వివరాలలోకి వెళితే... అయ్యప్ప మాల ధరించిన ఇరువురు దంపతులు ఈ నెల 8న ఓ ప్రైవేట్ సర్వీస్ (AP16 TG 5299)లో శబరిమలై దర్శనానికి వెళ్లారు. 15న మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో కన్యాకుమారి వద్ద బైపాస్ రోడ్ లో గురువారం సాయంత్రం సమయంలో అయ్యప్ప స్వాముల కోసం రెండు గంటల సేపు టూరిస్ట్ నిలిపివేశారు. సముద్ర స్నానం, అక్కడున్న దేవాలయాలు సందర్శించి టూరిస్ట్ ఆపిన చోటికి రాత్రి 9 గంటలకు వచ్చిన సత్యనారాయణ, రమదేవి దంపతులు రోడ్డు ఇటువైపు నుండి రోడ్డు అటువైపున సర్వీస్ను ఎక్కడానికి దాటుతుండగ ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను కన్యాకుమారి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.