26-05-2025 01:18:12 AM
పెద్దపల్లి మే 25 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేట గ్రామంలో రైతు బబ్బూరి శ్యామ్ కు చెందిన ఆవు పొలం వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగలడం తో షాక్ తగిలి మృతి చెందింది. గ్రామానికి రైతు ఆదివారం మేత కోసం వెళ్లగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ వైర్లు తెగిపడడంతోపాటు.
ట్రాన్స్ఫర్ సమీపంలో ఉండడంతో ఆవు మేతకుపోగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చేందిందని రైతు రోధిస్తూ తెలిపారు. తన ఆవు విలువ దాదాపు రూ. 60. 000 వేలు ఉంటుందని వాపోయాడు. ప్రభుత్వం తనకు ఆర్థిక సాయం చేసే ఆదుకోవాలని రైతు అధికారులనుకోరారు.