15-10-2024 12:50:17 AM
సొంత ఖర్చుతో ఇంటి స్థలంలో ప్రహరీ నిర్మాణం
ఎల్బీనగర్, అక్టోబర్ 14: పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్యకు హయత్నగర్లో ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలంలో నిర్మించిన ప్రహరీని ఇటీవల గుర్తుతెలియని దుండగులు కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే హయత్నగర్ పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా రు.
కాగా విషయం తెలుసుకున్న రాచకొండ సీపీ సుధీర్బాబు మొగులయ్యకు ఇచ్చిన హామీ మేరకు సొంత ఖర్చుతో ఆదివారం ప్రహరీ నిర్మాణాన్ని పూర్తిచేయించారు. ఈ క్రమంలో సోమవారం ఎల్బీనగర్లోని సీపీ ఆఫీస్లో సుధీర్బాబును మొగులయ్య మరాద్యపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మొగులయ్యను ఘనంగా సన్మానించారు. ప్రహరీని కూల్చివేసిన వారిని త్వరలో గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ మనోహర్, హయత్నగర్ సీఐ నాగరాజు, ఎస్ఐ లింగారెడ్డి తదితరులు ఉన్నారు.