calender_icon.png 18 November, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ సంపద కార్పొరేట్ల ధారాదత్తం చేసిన మోదీ

18-11-2025 07:47:02 PM

వందేలుగా సిపిఐ ప్రజల కోసం పోరాటం చేస్తుంది.

సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి.

హుజురాబాద్ (విజయక్రాంతి): దేశ సంపదను కార్పొరేట్లకు ధారాధత్వం చేసిన ఘనత భారత ప్రధాని మోడీకి దక్కుతదని సిపిఐ జాతీయ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ వందేళ్ళ ప్రజా ఉద్యమాల చరిత్ర, అనేకమంది త్యాగజనుల, పోరాట యోధుల త్యాగాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు తెలియజేసేందుకు. ఈ జాత నవంబర్ 15న కొమరం భీమ్ జిల్లా జోడేఘాట్ నుండి ప్రారంభమై మంగళవారం హుజరాబాద్ పట్టణానికి చేరుకుంది. ఈ బస్సు జాతకు హుజురాబాద్ మండల కార్యదర్శి గోవిందుల రవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ. బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో సిపిఐ పార్టీ ఆవిర్భవించిందని, స్వతంత్ర పోరాటంలో ఏ పార్టీ కూడా పాల్గొనలేదని సిపిఐ పార్టీ మాత్రమే ఉందని తెలిపారు.

100 సంవత్సరాల నుండి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని గుర్తు చేశారు. సుమారు భారతదేశంలో 6 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారని, భారత ప్రధాని మోడీ ఏం చేస్తున్నాడని అన్నారు నల్లధనాన్ని పేద ప్రజలకు పంచుతానాన్ని మాయమాటలు చెప్పిన మోడీ బాల కార్మికుల కోసం ఎలాంటి చట్టం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈ దేశంలో రాజకీయ పార్టీల పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావట్లేదన్నారు. కమ్యూనిస్టులు రెండుగా చీలిపోవడంతో బలహీన పడ్డామని అందరం కలిసికట్టుగా పోరాడుదాం అని పిలుపునిచ్చారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమని తెలిపినప్పటికీ, కూబింగ్ నిర్వహిస్తూ ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్ రావు, శంకర్, ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రామారపు వెంకటేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.