17-05-2025 12:00:00 AM
బెల్లంపల్లి అర్బన్, మే 16 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ 21వ మహాసభ ఈనెల 25న జరుగుతున్నదనీ ఆ పార్టీ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి తెలిపారు. గురువారం మహాసభకు సంబంధించిన కరపత్రాలను స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆవిష్కరించారు. 25 న ఉదయం 10 గంటలకు కామ్రేడ్ బాసెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ లో జరుగుతుందని సీపీఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి నేటికీ 100 సంవత్సరాల కాలంలో ఈ దేశ స్వాతంత్ర కోసం దేశ ప్రజల అనేక సమస్యలపై అలుపెరగని ఎన్నో పోరాటాలు, రైతాంగ సాయుధ పోరాటాలు జరిగాయని అన్నారు. అలాగే ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని మొదలుపెట్టి రాబోయే కాలంలో కమ్యూనిస్టు పార్టీని ముందుకు తీసుకుపోతామని, ప్రజలు పార్టీ ని ఆదరించి అభిమానించి పార్టీకి చేయూత నివ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ,జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంత ల లక్ష్మీనారాయణ ,సీనియర్ నాయకురాలు సరోజ, జిల్లా సమితి సభ్యులు బియ్యాల ఉపేందర్, పట్టణ కార్యవర్గ సభ్యులు రత్నం రాజం,బొంకురి రామ చందర్, శనిగారపు రాజేందర్,బండారు శంకర్, ఇనుముల రాజమల్లు,కోడి శ్రీనివాస్ పాల్గొన్నారు.