17-05-2025 12:00:00 AM
నాగల్ గిద్ద మే 16 : మండలంలోని కరస్ గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ జువేరియా డెంగ్యూపై ర్యాలీ నిర్వహించి అవగాహన క ల్పించారు. ఆమె మాట్లాడుతూ మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పాటిస్తున్నందున ప్రభుత్వం డెంగ్యూ, చికున్ గున్యా, జి కా, పసుపు జ్వరం వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులపై నివారణ చర్యలను చేపట్టాలని ముఖ్యంగా వర్షాకాలంలో పెరుగుతున్న డెంగ్యూ జ్వర ముప్పు గురించి అవ గాహన పెంచడానికి కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.
ఇళ్లలో నీటిని నిలువ చే యకుండా ఇంటిని పరిశుభ్రత ఉంచుకోవాలని డాక్టర్ జువేరియా తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఆసుపత్రి సూపర్వైజర్ విక్టోరియా రాణి, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు తదితరులుపాల్గొన్నారు.