ప్రజల కోసం పోరాడే పార్టీ సీపీఎం
09-02-2026 12:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 8(విజయ క్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ అన్నారు. ఆసిఫాబాద్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకులు ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాజన్న కుషన్న, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, ముంజం ఆనంద్, జిల్లా కమిటీ సభ్యులు గుడిసెల కార్తీక్, గేడం టికానంద్, కోరంగ మాల శ్రీ ,రాజేందర్, భారత్ జాడే తదితరులు పాల్గొన్నారు.






