భారత క్రికెటర్ రింకు సింగ్కు పితృవియోగం
అలీగఢ్/నోయిడా: భారత క్రికెటర్ రింకు సింగ్(Rinku Singh father passes away) తండ్రి ఖాన్చంద్ సింగ్ శుక్రవారం తెల్లవారుజామున గ్రేటర్ నోయిడాలోని(Greater Noida) ఒక ఆసుపత్రిలో కన్నుమూశారని కుటుంబ వర్గాలు తెలిపాయి. క్రికెటర్ తండ్రి చేరిన గ్రేటర్ నోయిడాలోని యథర్త్ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఖాన్చంద్ సింగ్ కాలేయ క్యాన్సర్తో(Liver cancer) పోరాడుతున్నారని అన్నారు. "ఇటీవలి రోజుల్లో ఆయన పరిస్థితి గణనీయంగా క్షీణించింది, ఆ తర్వాత ఫిబ్రవరి 21న ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. వెంటిలేటర్పై ఉంచి ఈ ఉదయం తుది శ్వాస విడిచారు" అని కుమార్ చెప్పారు. "ఈ సంక్షోభ సమయంలో రింకు సింగ్(Rinku Singh ), అతని మొత్తం కుటుంబానికి బీసీసీఐ తరపున నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తన తండ్రి చికిత్స పొందుతున్న గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రికి త్వరగా వెళ్లడానికి ఆయన ఉదయం 5 గంటలకు చెన్నై నుండి ఢిల్లీకి బయలుదేరారు" అని సైకియా అన్నారు.




