30 May, 2026 | 9:18 PM

Breaking News

నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు: సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు   •   ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలి   •   ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ రాష్ట్రానికి మొదటి స్థానం   •   సత్యనారాయణపురం గ్రామంలో భూ సమస్యలపై సమావేశం   •   పంచాయతీ కార్యదర్శిపై చేయి చేసుకున్న సీనియర్ అసిస్టెంట్   •   ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ హల్‌చల్   •   కమనీయం.. రమనీయంగా వనదుర్గమ్మ పల్లకి సేవ   •   చెరువులో పడి మృతి చెందిన శంకర్ మృతదేహం వెలికి తీత   •   జూన్ 3న వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా మహాసభను విజయవంతం చేయాలి   •   ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు   •  

అక్రమ నిర్మాణదారులపై క్రిమినల్ కేసులే

30-05-2026 08:45 PM

కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేష్

జవహర్ నగర్,(విజయక్రాంతి): అక్రమ నిర్మాణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, జవహర్ నగర్ లో పూర్తిగా సర్కారు భూములే ఉన్నాయని, పేద ప్రజలు ప్లాట్లు కొని మోసపోవొద్దని తహసీల్దార్ రాజేష్ హెచ్చరించారు. కాప్రా తహసీల్దార్ రాజేష్ ఆదేశాల మేరకు జవహర్ నగర్ లోని పలు అక్రమ కట్టడాలను శనివారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సమక్షంలో కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్బంగా రాజేష్ మాట్లాడుతూ... ప్రభుత్వ భూముల పరిరక్షణకు కృషి చేస్తున్నామని, కబ్జాదారులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని అన్నారు. అంబేద్కర్ నగర్, వికలాంగుల కాలనీ, బీజేఆర్ నగర్ లో అక్రమంగా వెలిసిన కట్టడాలను కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.