05-06-2025 12:00:00 AM
మాముదాల కిరణ్కుమార్ :
నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతుల సంక్షేమం కోసం 2016లో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పీఎంఎఫ్బీవై (ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన) పథకం సంపూర్ణంగా ఫలవంతం కావలసి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేకమంది రైతుల విషయంలో ఇది పూర్తిస్థాయిలో ప్రయోజనకరంగా ఉండటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. మనం అన్ని విషయాలనూ ప్రామాణికంగా తీసుకోలేం.
కానీ, కొందరి అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకోవలసి ఉంటుంది. తమిళనాడులోని శివగంగ పార్లమెంట్ (లోకసభ) సభ్యుడు కార్తీ పీ.చిదంబరం ఇటీవల పై పథకం విఫలమవుతున్నట్టు పత్రికాముఖంగా విమర్శించారు. మునుపటి పథకాలలోని కొన్ని లోపాలతోనే ఇది కొనసాగుతున్నట్టు ఆ యన ‘ది ప్రింట్’ ఆంగ్లవార్తాపత్రికలో ఆరోపించారు. నిజానిజాలు తెలుసుకోవడానికి అసాధ్యమైనవేమీ కావు.
ప్రత్యేకించి క్లెయిమ్ (బీమా ఒప్పందం)ను పరిష్కరించే అభేద్యమైన, సంక్లి ష్టమైన, అధిక సాంకేతికతతో కూడిన ప్రక్రియలవల్లే ప్రస్తుత పీఎంఎఫ్బీవై పథకం అందరి విషయంలోనూ విజయవంతం కాలేక పోతున్నది. ఈ ప్రాథమిక స్థాయి లోపాలను సవరించుకోవలసిందిగా కూ డా కార్తీ పీ.చిదంబరం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారతదేశ రైతులు దేశ ఆహార భద్రతకు నాయకత్వం వంటివారు.
అయినా, అనేక సమస్యలు, సంక్షోభాలతో దీర్ఘకాలిక దుఃఖం వారిని వెంటాడుతూనే ఉంది. కీలకమైన రైతుల భాగస్వామ్యానికి తగిన గుర్తింపు, సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వా ల నుంచి వారికి సంపూర్ణంగా అందని కారణంగా ఇప్పటికీ లక్షలు, కోట్లసంఖ్యలో రైతన్నలు అత్యంత దుర్బర జీవితాలనే గడుపుతున్నారు.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, రైతుల సమస్యలు అపరిష్కృ తంగా ఉండటాన్ని విమర్శించారు. వారినుంచి నిరంతరం ఫిర్యాదులు వినిపిస్తూనే ఉండటం బాధాకరమని అంటూనే, ‘రైతులను జాగ్రత్తగా చూసుకోవడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత’ అని నొక్కి చెప్పారు.
సంక్షోభంలో గ్రామీణ వెన్నెముక
భారతదేశ జీడీపీలో వ్యవసాయం కేవ లం 18.2 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, దా దాపు 42.3 శాతం జనాభాకు ఇదే ప్రధాన జీవనాధారం. రైతే లేకపోతే తినడానికి తిండిగింజలు ఉండవు. అయితే, గత దశాబ్దంలో భారతదేశం వ్యవసాయ ఉపాధిలో గణనీయమైన తగ్గుదలను చవిచూసింది. ఇది ఈ రంగం క్షీణిస్తున్న మనుగడను నొక్కి చెబుతున్నది.
పంట వైఫల్యాలు, ధరలు తగ్గడం, బీమాద్వారా భద్రత కల్పించాలనే ప్రభుత్వ వాగ్దానం పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం వల్ల వ్యవసాయ సంక్షోభం ఇంకా సజీవంగానే వుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2015 డేటా ప్రకారం, రైతులలో 80 శా తం ఆత్మహత్యలు అప్పులు, దివాలా కారణంగా జరిగాయి. ఈ సంక్షోభం స్థిరమైన పెరుగుదల ధోరణిని కూడా చాటుతున్న ది.
వ్యవసాయ రంగంలో పనిచేసే 1,12,000 కంటే ఎక్కువమంది గత పదేళ్ల లో ఆత్మహత్యవల్లే మరణించారని ఎన్సీఆర్బీ డిసెంబర్ 2023లో విడుదల చేసిన డేటా వెల్లడించింది. భారతదేశంలో ప్రతీ గంటకు కనీసం ఒక రైతు ఆత్మహత్య ద్వా రా మరణించారని పై గణాంకాలు సూచిస్తున్నాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) నిర్వహించిన 2018 సర్వేలో మన దేశంలో 50 శాతం కంటే ఎక్కువ వ్యవసాయ కుటుంబాలు రుణాల కూపం లో దిగబడి ఉన్నారని తేలింది.
2016లో ప్రారంభమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) పంటబీమాకు హామీ ఇచ్చింది. తద్వారా ఒక రకంగా రైతుల విశ్వాసాన్ని చక్కగా పు నరుద్ధరించినట్టయ్యింది. “అయితే, ఇదం తా కాగితంపై మాత్రమే. మునుపటి అనేక లోపాలను పథకం ప్రతిబింబించింది” అని ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు.
నిశితంగా పరిశీలిస్తే ఇందులో వాస్తవం ఉన్నట్లు అంగీకరించవలసి వస్తుంది. ఈ ప్రతిష్ఠాత్మక బీమాసేవ మునుపటి పథకాల అనేక లోపాలను పరిష్కరించకుండా నే అమలులోకి రావడం ఆశ్చర్యం. ఇది మరో రకంగా భారత రైతు సమాజం అం చనాలను అందుకోలేక పోవడమే కాక అ ది రక్షించాల్సిన ప్రజలను దూరం చేస్తున్నట్లు అర్థమవుతుంది.
అత్యంత సంక్లిష్ట పరిస్థితులు
ముఖ్యంగా క్లెయిమ్లను పరిష్కరించడంలో అత్యంత సంక్లిష్ట పరిస్థితులు ఇం దులో కొనసాగుతున్నాయి. దానిలోని ఒక ప్రాథమిక లోపం స్పష్టంగా కనిపిస్తుంది. సాగు అయిన విస్తారమైన యూనిట్లలో అధికారులు ఉపగ్రహ ఇమేజింగ్, సగటు డేటాను ఉపయోగించడం చేస్తున్నారు. దీనివల్ల భూమి వాస్తవాల నుంచి చాలా దూరం వెళ్ళిపోతుంది. ఉపగ్రహ సంబంధ తనిఖీలు పరిధిలో పరిమితంగానే వుంటాయి.
అవి పంటల ఉనికిని లేదా ఉనికిలో లేకపోవడాన్ని మాత్రమే గుర్తిస్తాయి. ఇం కా సదరు పంట ఆరోగ్యం లేదా దిగుబడి సామర్థ్యాన్ని కూడా అవి నిర్ణయించలేవు. అలాగే, ఒక రకమైన పంట నుంచి మరొక రకమైన పంటను సైతం ఆ రకమైన డేటా విడమరిచి చెప్పలేదు. ఈ సాంకేతిక బలహీనతను పరిహారం కోసం ప్రాతిపదికగా ఉపయోగించడం ఎంవరకు సమంజసం? తత్ఫలితంగా తప్పుడు లెక్కలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఇది రైతుల నిజమైన జీ వనోపాధికి నష్టదాయకం కూడా. తెగుళ్ళు లేదా పోషకాల లోపాలు వంటివాటి కారణంగా సంభవించే భారీ నష్టాలను చవి చూసే రైతులకు వారి పంటలు పైనుంచి చూడటానికి పచ్చగానే కనిపిస్తాయి. ఈ రకమైన ఆధునిక సాంకేతిక ఏర్పాట్లు అధికారులకు ఒకింత ఉపయోగపడతాయేమో కానీ, రైతులకు మాత్రం దీనివల్ల పరిహారం అందకుండా పోయే అవకాశం ఉంటుంది.
ప్రస్తుత నమూనాలో అంతర్లీనంగా ఉ న్న అసమానత ఇంకా భయంకరమైంది. రైతులు వ్యక్తిగత స్థాయిలో ప్రీమియంలు చెల్లిస్తుండగా, యూనిట్లను నిర్వచించడం లో ఎటువంటి ఈక్విటీ ఆధారిత పద్ధతి లే దు. గ్రామ సమూహాలలో లేదా అస్పష్టం గా నిర్వచించబడిన పెద్ద ప్యాచెస్లలోని పె ద్ద, చిన్న భూస్వాములను సమగ్ర పరచ డం ద్వారా పరిహారం లెక్కిస్తున్నారు.
దీని ఫలితంగా క్లెయిమ్లు వివక్షకేకాక తిరస్కరణలకు కూడా గురవుతున్నాయి. ముఖ్యం గా, పంటల స్థానికీకరించిన లేదా పూర్తిగా నష్టాన్ని ఎదుర్కొంటున్న వారికి ఈ అసౌకర్యం తప్పడం లేదు. ఉదా॥కు ఒక గ్రామంలోని ఒక మూలలో ఆకస్మిక వరద వంటి స్థానిక వాతావరణ పరిస్థితులు ఏర్పడి, ఒక చిన్న రైతు పంటను నాశనం చేస్తే, ఇదే సమయంలో అతని పొరుగువారి పంట చెక్కుచెదరకుండా ఉండవచ్చు.
అందరికీ మేలు జరిగేలా!
ఈ వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రెంటినీ ఒకే విధంగా కొలవడం వల్ల సమస్యగా మారుతున్నది. సామూహిక గణాంకాల ద్వారా వ్యక్తిగత వేదనలు, బాధలను తొలగించడం ఒక రకంగా అసాధ్యమే. ఈ కార్యక్రమం అత్యంత ప్రమా దంలో ఉన్నవారిని కూడా కవర్ చేయడం లేదని తెలుస్తున్నది.
కౌలు రైతులు, వాటాదారులు, మహిళా సాగుదారులు, రుణం తీసుకోని రైతులు ఇలాంటి వారంతా భూ మి హక్కు అవసరాలు, పురాతన కౌలు చట్టాలు, ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాలు వంటి అధికారిక అడ్డంకుల ద్వారా ఒక క్రమపద్ధతిలో, పరోక్షంగా మినహాయింపు బారిన పడుతున్న తెలుస్తున్నది. మహిళలు అధికారిక భూమి లేకపోవడం వల్ల ఈ వ్యవస్థలో లెక్కింపుకు రావడం లేదు.
ఈ లోపాలను ప్రమాదవశాత్తు అని కాకుండా ప్రస్తుత కాలంలో భారతీయ సాగు పద్ధతిలోని నిజ దృశ్యాన్ని చూడని రూపకల్పన తాలూకు వ్యక్తీకరణలుగానే భావించాలి. కేంద్రం, రాష్ట్రాలు ప్రీమియం ఛార్జీలలో 80 శాతం సబ్సిడీ ఇస్తున్నాయి. అయినప్పటికీ, ప్రైవేట్ బీమా కంపెనీలు స్థిరంగా లాభాలను ఆర్జిస్తున్నాయి. కానీ, దీనివల్ల అసలైన సగటు రైతులకు పెద్దగా లాభం సిద్ధించడం లేదు.
కంపెనీలు రిస్క్-ఫ్రీ ప్రీమియంలను వసూలు చేస్తున్నప్పటి కీ, క్లెయిమ్లు మాత్రం ఆలస్యం, వివాదం లేదా తిరస్కరణకు గురవుతాయి. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, సర్వే జరిపిన రైతుల్లో కేవలం 37 శాతం మందికే పీఎంఎఫ్బివై ప్రయోజనాలు, ప్రీమియం నిర్మాణాలు లేదా క్లెయిమ్ ప్రక్రియల గురించి అవగాహన ఉన్నట్లు 2022 కాగ్ నివేదిక పేర్కొంది.