calender_icon.png 31 July, 2025 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

100 కోట్ల జీఎస్టీ మోసం

31-07-2025 12:32:03 AM

కేషన్ ఇండస్ట్రీస్ నకిలీ వే బిల్లులు 

వాణిజ్య పన్నుల శాఖ దాడులతో బయటపడ్డ మోసం

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 30 (విజయ క్రాంతి) : తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో భారీ పన్ను మోసం వెలుగులోకి వచ్చింది. మోసాలపై దర్యాప్తు చేపట్టినట్లు వాణిజ్య పన్నుల కమిషనర్ కే హరిత ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనర్ తెలిపిన ప్రకారం, ఈ కేసులో హైదరాబాద్‌లోని ప్రైవేట్ సంస్థ ఎంఎస్ కేషన్ ఇండస్ట్రీస్ ఎల్‌ఎల్‌పీ ప్రధానపాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట గోదాం, మెదక్ జిల్లాలోని కాళ్లకల్ ఆటోమోటివ్ పార్క్, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల్లోని తయారీ యూనిట్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. సరుకు లు తరలించకుండా భారీ విలువ కలిగిన కాపర్ సరుకుల సప్లుకి సంబంధించి పన్ను బిల్లులు జారీ చేసినట్లు అధికారు లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ వాహనాలను తెలంగాణ నుంచి మహారాష్ర్టకు పంపించగా.. డా క్యుమెంట్లలో మాత్రం భారీ సరుకుల రవాణా జరిగినట్టు చూపించిన ట్లు అధికారులు నిర్థా రించారు.

నకి లీ వే బిల్లుల మొత్తం విలు వ రూ. 100 కోట్లకు పైగా ఉండవచ్చని అం చనా వేస్తున్నారు. ఈ మోసం టోల్ గేట్ డేటా విశ్లేషణ ద్వారా వెలుగులోకి వచ్చింది. సంస్థ సుమారు రూ. 33.20 కోట్లు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను నకిలీ లావాదేవీల ద్వారా పొం దినట్టు అధికారులు గుర్తించారు.

ఖాతా పుస్తకాలు, రిజిస్టర్లు, హార్డ్ డిస్కులు, సీసీటీవీ ఫుటేజ్ తదితర ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంస్థ డైరెక్టర్లు వికాశ్ కుమార్ కేషన్, రజనీశ్ కేషన్‌పై సీసీఎస్ డీసీపీకి అధికారులు ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో మరో సంఘటనలో, చార్మినార్ డివిజన్ మెహదీప ట్నం--1 సర్కిల్‌కు చెందిన డీఎస్టీవో మజీద్ హుస్సేన్ మరో మోసాన్ని గుర్తించారు. మోసాలపై దర్యాప్తు చేపట్టినట్లు వాణిజ్య పన్నుల కమిషనర్ కే హరిత తెలిపారు.