షేర్మార్కెట్ పేరుతో సైబర్ మోసం
10-12-2024 01:41 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (విజయక్రాంతి): షేర్ మార్కె ట్లో పెట్టుబడుల పేరుతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని నమ్మించి సైబర్ నేరగాళ్లు 8.41 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి(45)కి ఇటీవల స్కామర్లు ఫోన్ చేసి షేర్ మా ర్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించారు.
వారి మాటలు నమ్మిన బాధితుడు పలు దఫాలుగా మొత్తం రూ.8.41 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. వచ్చిన లాభాలను విత్డ్రా చేసుకోవడానికి స్కామర్లు అవకాశం కల్పించలేదు. జరిగిన మోసాన్ని గ్రహించిన బాధితుడు సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.






