12 March, 2026 | 10:17 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

రామప్పను దర్శించుకున్న సీఎం అధికారిక కార్యక్రమాల వ్యాఖ్యాత దక్షిణామూర్తి

19-01-2026 07:33 PM

వెంకటాపూర్,(విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటపూర్ మండలంలోని ప్రపంచ ప్రఖ్యాత గాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సీఎం అధికారిక కార్యక్రమాల వ్యాఖ్యాత దక్షిణమూర్తి కుటుంబ సభ్యులతో సహా సోమవారం దర్శించుకున్నారు. సోమవారాల్లో మేడారంలో సీఎం కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన తిరుగు ప్రయాణంలో రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్నారు. దేవాలయం పూజారి కోమల్ల హరీష్ శర్మ వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. స్వామివారి శేష వస్త్రాలతో దక్షిణామూర్తిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ గిరిబాబు, జిపిఓ సూరయ్య, రామప్ప జర్నలిస్టు సొసైటీ అధ్యక్షుడు భేటీ సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.