1 August, 2026 | 6:56 PM

Breaking News

కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ   •   ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థిని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ పోస్టర్ ఆవిష్కరణ   •   ఊర పండుగ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ   •   చిట్టాపూర్‌లో మహిళా గ్రామసభ   •   నిజాయతీ చాటుకున్న వ్యాపారికి సామాజిక కార్యకర్త ఘన సన్మానం   •   పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొట్ట మొదటి టీకా   •   గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే లక్ష్యం   •   ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధనకు నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య   •   వికలాంగులకు అన్నదానం చేసిన తాటిపల్లి భూపతి   •  

దళితబంధు నిధులను విడుదల చేయాలి

24-08-2024 02:51 AM

ప్రజా భవన్ ఎదుట లబ్ధిదారుల ధర్నా 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో రెండో విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళితబంధు సాధన సమితి ఆ ధ్వర్యంలో శుక్రవారం ప్రజాభవన్ ఎదుట ధర్నా చేశారు. దళితబంధు సాధన సమితి అధ్యక్షుడు కొగిలి మహేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని కొనసాగిస్తున్నట్టుగా, అందుకు రూ. 2 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించినట్టుగా అసెంబ్లీలో ప్రకటించిందని గుర్తు చేశారు.

కానీ లబ్ధి దారులకు నిధులు కేటాయించడంలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై న దళితబంధు యూనిట్లను విడుదల చేయాలని కోరారు. లేదంటే మంత్రులు, ప్రజాప్రతినిధులను తిరగనివ్వబోమని హెచ్చరించారు. ధ ర్నాలో దళితబంధు సాధన సమితి రాష్ట్ర ఉ పాధ్యక్షుడు బోనగిరి శ్రీనివాస్, కన్వీనర్ చిట్టిమల్ల సమ్మయ్య, కో ఆర్డినేటర్ మడికొండ రమేష్, నాయకులు చిలుమల శంకర్, శంకర్, పాలడుగుల వెంకటేశ్వర్లు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.