16-02-2026 07:00:25 PM
ఎంపీడీఓ ఆంజనేయులు
మోతె,(విజయక్రాంతి): గ్రామాలలో మౌలిక సమస్యల పరిష్కారం, కోసం ప్రతి వార్డు సభ్యులు, కృషి చేయాలని, యంపిడిఓ తిప్పని ఆంజనేయులు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో శ్రీ శక్తి భవన్ లో జరిగిన వార్డు సభ్యుల, మొదటి విడత మొదటి రోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్క సభ్యులు నిరంతరం ప్రజల సమస్యలు, తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకరావాలని, త్రాగు నీటి, సమస్యలు వీధి దీపాల సమస్యతో పాటు గ్రామంలో ఏ మూల పారిశుద్యం లోపించిన,
గ్రామ కార్యదర్శి దృష్టికి తెచ్చి వెంటనే సమస్య లేకుండా చూడాలని, మురుగు కాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా గ్రామ పంచాయతీ సిబ్బదితో సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేటికి గ్రామాలలో వసూలు కానీ ఇంటి పన్నులకు గ్రామ కార్యదర్శికి సహకరించి, ఇంటి పన్నులు వసూలు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు రాము, వెంకన్న, ఆయా గ్రామాల వార్డు సభ్యులు ఈశ్వరి రవి, అశ్విని రామోజీ, కోర్ర లక్పతి, అమ్మి కిట్టు, బాసు, వీరబాబు, రమేష్, యశోద తదితరులు పాల్గొన్నారు.