02-12-2025 06:18:45 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని గండి రామన్న దత్త మందిరం మందులాపూర్ సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించి వేడుకల్లో భాగంగా మొదటి రోజు సాయి పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బురాజ్ ధర్మకర్తలు ఉన్నారు.