శుభకార్యాల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
26-03-2026 12:16 AM
నిజాంసాగర్ మార్చి 25( విజయ కాంతి ): నిజాంసాగర్ ఉమ్మడి మండలాల్లో జరిగిన పలు శుభకార్యాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్లో జక్సాని శ్రీనివాస్ సెట్ కుమార్తె ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి హాజరైన వధూవరులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిజాంసాగర్ మండలంలోని సొసైటీ ఫంక్షన్ హాల్లో గోర్గల్ గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ రామ గౌడ్ కుమార్తె ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొని, వధూవరులను ఆశీర్వదించారు. నిజాంసాగర్ మండలం ప్రజా ప్రతినిధులు, మహమ్మద్ నగర్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




