15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పురుగు మందు సేవించి చికిత్స పొందుతూ మృతి..

18-12-2025 04:32 PM

పాపన్నపేట (విజయక్రాంతి): పురుగు మందు సేవించి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బైకని శ్రీనివాస్(38) ప్రైవేటు డ్రైవర్ గా పని చేసేవాడు. కొన్ని నెలల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో కాలు విరిగి ఇంటి వద్దే ఉంటున్నాడు. కాలు విరిగిందని ఏ పని చేయలేక పోతున్నానని తరచూ ఇంట్లో బాధ పడుతుండేవాడు. మనస్తాపం చెందిన అతను జీవితంపై విరక్తి చెంది బుధవారం ఇంట్లో నుంచి పొలం వద్దకు వెళ్లాడు. పురుగు మందు సేవించి అవస్థ పడుతుండగా స్థానికులు గమనించి చికిత్స కోసం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి సమయంలో మృతి చెందాడు. మృతుడి భార్య ఎలీషా ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.